News September 10, 2025

నార్నూర్ కేజీబీవీని సందర్శించిన సబ్ కలెక్టర్

image

నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ బుధవారం సందర్శించారు. ఈ పాఠశాలలో ఉదయం విద్యార్థినుల భోజనంలో పురుగులు ఉన్నాయని ఆరోపణలు రాగా ఆయన ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయనతో పాటు విద్యాధికారి పవార్ అనిత, తహశీల్దార్ రాజలింగం తదితరులు ఉన్నారు.

Similar News

News March 18, 2026

ADB: గ్రామాలను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా మార్చాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ‘మూడవ కన్ను’లా పనిచేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటి ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

News March 18, 2026

ADB: ఖోడద్ అభివృద్ధికి ఉద్యోగుల కృషి భేష్- కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామ అభివృద్ధికి ఆ గ్రామానికి చెందిన ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. సొంత ప్రాంతంపై మమకారంతో విజ్ఞానాన్ని పంచేందుకు లైబ్రరీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 18, 2026

ADB: ఖోడద్ అభివృద్ధికి ఉద్యోగుల కృషి భేష్- కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామ అభివృద్ధికి ఆ గ్రామానికి చెందిన ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. సొంత ప్రాంతంపై మమకారంతో విజ్ఞానాన్ని పంచేందుకు లైబ్రరీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు.