News September 10, 2025
రెండు బైక్లు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం..!

హుకుంపేట మండలం కొంతిలి గ్రామ జాతీయ రహదారి వద్ద బుధవారం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉండాగా మరో ఇద్దరిని ఆటోలో హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. పాడేరు నుంచి బైక్ పై వస్తున్న ఫ్యామిలీని మద్యం మత్తులో బైక్ పై ఎదురుగా వస్తున్న వ్యక్తి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 11, 2025
MHBD: దోమల నివారణకు ఫాగింగ్ జాడెక్కడ..?

జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం పట్టణాల్లో దోమల నివారణ చర్యలు లేకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు ఏటా దోమల నివారణకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా, ఆచరణలో ఫాగింగ్ కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News September 11, 2025
VZM: నేడు రాష్ట్రానికి చేరుకోనున్న యాత్రికులు

నేపాల్లో గడిచిన 2 రోజులగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా నుంచి మొత్తం 61 మంది మానససరోవర యాత్రకు వెళ్లిన వారు ఉన్నారు. వారిని రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఖాట్మండు నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాత్రికులందరూ రాష్ట్రానికి చేరుకుంటారన్నారు. వారి బంధువులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు.
News September 11, 2025
వనపర్తి: ఇంటర్ ప్రవేశాలు.. ఈనెల 12 వరకు ఛాన్స్

వనపర్తి జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 12 వరకు అవకాశం కల్పించినట్లు డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా, ప్రైవేట్ కళాశాలల్లో రూ. 500 అపరాధ రుసుముతో ప్రవేశాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అడ్మిషన్ పొందకుండా ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.