News September 10, 2025

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: డిఐఈఓ

image

మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని వనపర్తి డీఐఈవో ఎర్ర అంజయ్య సూచించారు. బుధవారం గోపాల్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, మంచి స్నేహానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఈమేరకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

Similar News

News March 10, 2026

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్తీక్ మృతి

image

ఎచ్చెర్ల ప్రధాన రహదారిలోని సర్వీస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనం <<19333513>>బోల్తా<<>> ఘటనలో అరసవిల్లి కార్తీక్ (18) గాయపడిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు మధు చరణ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా రహదారిపై మొక్కజొన్న పంట టార్పాలిన్ కప్పి ఉండడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. అతడిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.

News March 10, 2026

KNR: 14న బండి సంజయ్ యాత్ర

image

ఇచ్చిన మాట ప్రకారం కరీంనగర్ మేయర్ పీఠంతో పాటు స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా కేంద్రమంత్రి బండి సంజయ్ ఈనెల 14న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభమై, 40 కి.మీల మేర సాగే ఈ పాదయాత్ర సాయంత్రానికి కొండగట్టు చేరుకుంటుంది. నూతన ప్రజాప్రతినిధులు, 10 వేల మంది కార్యకర్తలతో కలిసి ఆయన మొక్కులు తీర్చుకోనున్నారు.

News March 10, 2026

అమలాపురం: అన్నం ఉడకలేదని భర్త కొట్టాడు.. 112కి కాల్ చేసిన భార్య..!

image

అమలాపురం పట్టణంలోని మెట్ల కాలనీలో ఓ మహిళ నుంచి పోలీసులకు విచిత్రమైన పిలుపు అందింది. వండిన అన్నం సరిగ్గా ఉడకలేదనే కారణంతో భర్త తనను కొట్టాడంటూ ఆమె 112కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమె ఇంటికి చేరుకోగా భర్త అక్కడ లేరు. దీంతో పోలీసులు ఆమెతో భర్తకు ఫోన్ చేయించి కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న విషయాలకే పోలీసులకు ఫోన్ చేయడం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.