News September 10, 2025
ఆన్లైన్ అడ్మిషన్లకు రెండు రోజులు అవకాశం: డీఐఈవో

వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ ఇంటర్ అడ్మిషన్లకు రెండు రోజులు చివరి అవకాశం కల్పించనున్నట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ల గడువు ఆగస్టు 31తో చివరి అవకాశం ముగిసినప్పటికీ పలువురు విద్యార్థుల అడ్మిషన్ పెండింగ్ ఉందన్నారు. దీంతో ఈనెల 11, 12న అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 11, 2025
ముధోల్: గుండెపోటుతో యువ గాయకుడి మృతి

ముధోల్ గ్రామానికి చెందిన ముప్పిడి కిషోర్(32) యువ గాయకుడు గుండెపోటుతో మృతి చెందాడు. రెండ్రోజుల క్రితం కరీంనగర్లో బంధువుల ఇంటికి వెళ్లిన కిషోర్ బుధవారం HYDలో ఈవెంట్కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చి కిందపడిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహమైంది. 2 నెలల కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని ముధోల్ తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు.
News September 11, 2025
టీమ్ ఇండియాకు ఇదే ఫాస్టెస్ట్ విన్

ఆసియా కప్లో భాగంగా నిన్న UAEతో <<17672914>>మ్యాచులో<<>> భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. UAE నిర్దేశించిన 58 పరుగుల టార్గెట్ను ఇండియా 4.3 ఓవర్లలోనే ఛేదించింది. మరో 93 బంతులు మిగిలి ఉండగానే విక్టరీని అందుకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో తన ఫాస్టెస్ట్ విన్ను నమోదు చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాంట్లాండ్పై సాధించిన విజయమే (81 బాల్స్ మిగిలి ఉండగా గెలిచింది) రికార్డుగా ఉంది.
News September 11, 2025
MHBD: దోమల నివారణకు ఫాగింగ్ జాడెక్కడ..?

జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం పట్టణాల్లో దోమల నివారణ చర్యలు లేకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు ఏటా దోమల నివారణకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా, ఆచరణలో ఫాగింగ్ కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.