News September 10, 2025

సిద్దిపేట: RMPల వద్దకు వెళ్లకుండా చూడాలి: DMHO

image

ప్రజలు ప్రైవేట్ ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని DMHO డాక్టర్ ధనరాజ్ సూచించారు. బుధవారం తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని తిమ్మాపూర్, అనంతసాగర్‌లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును సందర్శించారు. ఆరోగ్య సమస్యల పై ముఖ్యంగా ఫీవర్ కేసుల గురించి రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. జ్వరంతో వచ్చిన వారికి రక్త నమూనాలను సేకరించాలన్నారు.

Similar News

News March 22, 2026

GK: ప్రపంచంలో అతి చిన్నవి

image

⋆ సముద్రం: ఆర్కిటిక్ (విస్తీర్ణం 14.05M చ.కి.మీ)
⋆ దేశం: వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ వైశాల్యం)
⋆ ఖండం: ఆస్ట్రేలియా (7.7-8.6M చ.కి.మీ వైశాల్యం)
⋆ పక్షి: బీ హమ్మింగ్‌బర్డ్ (5-6cm పొడవు, 2gms కంటే తక్కువ బరువు)
⋆ నది: US మాంటానాలో ఉన్న’రో’ నది (పొడవు 61m)
⋆ అతి చిన్న పుష్పం గల చెట్టు: ఉల్ఫియా ఆంగుస్టా

➜ రోజూ సా.5 గంటలకు GK బిట్స్

News March 22, 2026

కావలి: ఆ బోట్ల విడుదల వెనకున్న నేత ఎవరు..?

image

కొన్ని నెలల నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉన్న ఆ బోట్లను విడిపించడంలో కీలకంగా వ్యవహరించిన నేత ఎవరు? ఆయనకు దాని వలన వచ్చే లాభం ఏమిటనేది ప్రస్తుతం జిల్లాలో ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో ఎంపీ బీద మస్తాన్ రావు వీడియో షేర్ చేసి క్లారిటీ ఇవ్వగా.. ఇంత గొడవ జరిగినా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పందించలేదని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల తీర ప్రాంత సమస్య కావడంతో ఈ విషయం సమస్యాత్మకంగా మారుతోంది.

News March 22, 2026

నర్మెట: లాభసాటి పంటల దిశగా రైతులు ఆలోచన చేయాలి: మంత్రి తుమ్మల

image

కనీస మద్దతు ధరతో పాటు వరికి బోనస్ కూడా ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నర్మెటలో జరుగుతున్న రైతు సదస్సులు మాట్లాడారు. ‘లాభసాటి పంటల దిశగా రైతులు ఆలోచన చేయాలి. మనకు అవసరం ఎక్కువ ఉన్న పంటలకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించాలనేది సీఎం ఆలోచన అన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రిఫైనరీని కూడా సిద్దిపేట జిల్లాలోనే నిర్మిస్తున్నామన్నారు. ఇదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామన్నారు.