News September 10, 2025

VZM: ‘యూరియా మార్గమధ్యంలో ఉంది’

image

విజయనగరం జిల్లాలో ప్ర‌స్తుతం 200 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. బుధవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఐపీఎల్ కంపెనీ నుంచి కేటాయించిన 700 మెట్రిక్‌ టన్నులు మార్గ‌మ‌ధ్యంలో ఉంద‌ని, ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు చేరునుందన్నారు. అదేవిధంగా రైలు మార్గం ద్వారా కాకినాడ నుంచి ఇంకొక 500 మెట్రిక్ టన్నులు 3 రోజుల్లో వస్తుందన్నారు.

Similar News

News September 11, 2025

VZM: నేడు రాష్ట్రానికి చేరుకోనున్న యాత్రికులు

image

నేపాల్‌లో గడిచిన 2 రోజులగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా నుంచి మొత్తం 61 మంది మానససరోవర యాత్రకు వెళ్లిన వారు ఉన్నారు. వారిని రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఖాట్మండు నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాత్రికులందరూ రాష్ట్రానికి చేరుకుంటారన్నారు. వారి బంధువులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు.

News September 11, 2025

VZM: డయల్ యువర్ కలెక్టర్ వాయిదా

image

రైతుల‌కు త‌గినంత యూరియా జిల్లాలో అందుబాటులో ఉంద‌ని, పంపిణీ కూడా స‌క్ర‌మంగా జ‌రుగుతోంద‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ బుధవారం తెలిపారు. యూరియా స‌ర‌ఫ‌రాలో స‌మ‌స్య‌లు త‌గ్గాయ‌ని, డ‌యిల్ యువ‌ర్ క‌లెక్ట‌ర్ కార్య‌క్ర‌మానికి ఫోన్ చేసేవారి సంఖ్య కూడా త‌గ్గింద‌ని చెప్పారు. అందువ‌ల్ల డ‌యిల్ యువ‌ర్ క‌లెక్ట‌ర్‌ కార్య‌క్ర‌మాన్ని గురువారం నుంచి తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News September 10, 2025

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

విజయనగరం మండలం రీమా పేట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీ.టీ.అగ్రహారానికి చెందిన సిమ్మ రాము(50) మృతి చెందాడు. మృతుడు బండిపై ఐస్‌లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. బుధవారం ఐస్‌లు అమ్ముకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై రూరల్ ఎస్‌ఐ వి.అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.