News September 10, 2025

కస్తూర్బా గాంధీ పాఠశాలలకు 4 ఉత్తమ పురస్కారాలు : డిఈఓ

image

జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయ అధ్యాపకులకు నాలుగు ఉత్తమ పురస్కారాలు వచ్చినట్లు డిఈఓ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఉత్తమ SOగా రెబ్బెన కేజీబీవీ ప్రత్యేక అధికారి పద్మ, ఉత్తమ టీచర్ గా కాగజ్ నగర్ కేజీబీవీ సీఆర్టీ నిర్మల, ఉత్తమ పీఈటీగా ఆసిఫాబాద్ కేజీబీవీ సువర్ణ, స్పెషల్ కేటగిరీ కింద సిర్పూర్ యు కేజీబీవీ ప్రత్యేక అధికారి స్వప్నలకు ఉత్తమ పురస్కారాలు అందినట్లు తెలిపారు.

Similar News

News September 11, 2025

సంగారెడ్డి: జిల్లాలో 7,44,157 మంది ఓటర్లు

image

జిల్లాలోని 613 పంచాయతీల్లో 7,44,157 మంది ఓటర్ల ఉన్నారని జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం 1458 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 25 జడ్పీటీసీ, 221 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు వివరించారు.

News September 11, 2025

సంగారెడ్డి: పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలోని వివిధ కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎఎన్ఎం, అకౌంటెట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విధాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ ఖాళీగా ఉన్న పోస్టులకు మహిళ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ దరఖాస్తులను ఈనెల 15వ తేదీ లోగ జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

News September 11, 2025

MHBD: కలెక్టర్ పేరిట వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దు: కలెక్టర్

image

మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేరుతో వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించ వద్దని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కొత్త వాట్సాప్ నంబర్ సృష్టించినట్లు తెలిసిందని, ఈ నకిలీ నంబర్‌కు ఎవరూ స్పందించవద్దని సూచించారు. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి, కలెక్టర్ పేరుతో వచ్చే రిక్వెస్ట్‌లకు స్పందించవద్దన్నారు.