News September 10, 2025
పాక్ జాతీయుడిని స్వదేశానికి పంపిన హైదరాబాద్ పోలీసులు

చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి పంపించారు. మహ్మద్ ఉస్మాన్(48) అనే వ్యక్తి నేపాల్ మీదుగా 2011లో భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్లో నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇతడు నిందితుడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఇతడిని సెప్టెంబర్ 9న అటారీ సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్కు అప్పగించారు.
Similar News
News March 20, 2026
పాలమూరు: మిర్చి రైతులను నట్టేట ముంచిన కోల్డ్ స్టోరేజీ యజమానులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మానవపాడు, వడ్డెపాడు మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంటను పక్క రాష్ట్రానికి తీసుకెళ్లగా అక్కడ దగా పడ్డామని, తమకు తెలియకుండానే కోల్డ్ స్టోరేజీ యజమానులు నిల్వలను విక్రయించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మినందుకు తమను నట్టేట ముంచారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News March 20, 2026
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన భద్రాద్రి ఎస్పీ

ముస్లిం సోదర, సోదరీమణులకు ఎస్పీ రోహిత్ రాజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలు ఈ పవిత్ర పండుగను కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో ముస్లింలు చేసిన కఠిన ఉపవాస దీక్షలను ఈద్-ఉల్-ఫితర్ పండుగతో ముగిస్తారని అన్నారు. ఈ రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలందరూ సోదర భావాన్ని కలిగియుండి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని కోరారు.
News March 20, 2026
బడ్జెట్లో విజన్, విషయం లేదు: రాకేష్ రెడ్డి

నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో విజన్, విషయం లేదని BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు, పెట్టుబడిదార్లకు, మార్కెట్ కి విశ్వాసం కల్పించడంలో ఘోరంగా ఫెయిల్ అయిందని, ఆరు గ్యారంటీలకు మంగళం పాడారు, డిక్లరేషన్లకు నీళ్లు వదిలారని, ఓటు వేసిన వాళ్లకు వెన్నుపోటు పొడిచారనీ ఫైర్ అయ్యారు.


