News September 10, 2025

నేపాల్‌లో చిక్కుకున్న కాకినాడ మహిళలు

image

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 మంది యాత్రికులు నేపాల్‌లో చిక్కుకున్నారు. వీరిలో కాకినాడకు చెందిన దాట్ల రోజారాణి (45), బుద్ధరాజు సరళ (65) ఉన్నారు. వారి వివరాలను సరళ బంధువు బుద్ధరాజు సత్యనారాయణ రాజు వెల్లడించారు. ఈ విషయంపై ఆయన మంత్రి లోకేశ్‌తో మాట్లాడారు. లోకేశ్ స్పందించి, వారిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు హామీ ఇచ్చారు.

Similar News

News March 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 11, 2026

కడప: రైతు కష్టం.. AMCలకు ఆదాయం పంట..!

image

రైతులు కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులపై కడప జిల్లా AMCలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవని నాటికి రూ.11.78 కోట్లు లభించింది. పంటల వారీగా AMCలకు లభించిన ఆదాయం రూ.లక్షల్లో ఇలా. వరి-194, బియ్యం-52, వేరుశనగ-43, ప్రొద్దుతిరుగుడు-3, పత్తి-117, ఉల్లి-17, పప్పుశనగ-86, కందులు-3, బత్తాయి-14,, పసుపు-99, మినుములు-98, నువ్వులు-,96, మొక్కజొన్న-62, జొన్న-16, పప్పుదినుసులు-12, అరటి-21, ఇతర పంటలు-239 లక్షలు.

News March 11, 2026

నిట్ విద్యార్థికి బెస్ట్ పోస్టర్ అవార్డు..!

image

ఐఐటీ ఖరగ్‌పూర్ రీసెర్చ్ పార్క్‌లో జరిగిన SPARC కాన్‌క్లేవ్‌లో నిట్ వరంగల్‌కు చెందిన సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి రాజదురై విశేష ప్రతిభ కనబరిచారు. డా.అనీత పర్యవేక్షణలో రూపొందించిన ఆయన పరిశోధన పోస్టర్‌కు ‘బెస్ట్ పోస్టర్ అవార్డు’ లభించింది. ఈ కాన్‌క్లేవ్‌లో మొత్తం 145 పరిశోధన ప్రెజెంటేషన్లు ప్రదర్శించగా.. అందులో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన కేవలం 14 పోస్టర్లను మాత్రమే ఈ అవార్డుకు ఎంపిక చేశారు.