News September 10, 2025
ఆదిలాబాద్: INTERలో చేరేందుకు మరో అవకాశం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేందుకు మరొకసారి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని ఆదిలాబాద్ డీఐఈఓ జాధవ్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో చేరాలనుకుంటే ఈనెల 11, 12 తేదీల్లో అడ్మిషన్ పొందాలని సూచించారు. అలాగే లాంగ్వేజ్ మార్పు చేసుకునేందుకు కూడా ఈ రెండు రోజులే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News March 11, 2026
ఆదిలాబాద్: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల కోసం విషయ నిపుణులతో అవగాహన కార్యక్రమం, రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 10,888 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 5,443 మంది, బాలికలు 5,445 మంది ఉన్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పరీక్షలు జరగనున్నాయి.
News March 10, 2026
ADB: నేటి INTER పరీక్షకు 385 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. మొత్తం 8,520 మంది విద్యార్థులకు గాను 8,135 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 292 మంది, ఒకేషనల్ విభాగంలో 93 మంది కలిపి మొత్తం 385 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
News March 10, 2026
ఆదిలాబాద్ సింగం.. ONE YEAR COMPLETE

ఆదిలాబాద్ జిల్లా SPగా అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాదయింది. ఈ ఏడాది కాలంలో ప్రజలు సేవలందించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపారు. క్రైంను అదుపులోపెట్టి మహిళలకు అండగా ఉంటూ దోపిడీదారుల పాలిట సింహ స్వప్నంలా మారారు. శాఖలో మార్పులు, కట్టుదిట్టమైన భద్రత ఉంటే ఇలాంటి ఎస్పీనే ఉండాలంటూ ఆదిలాబాద్ కా షేర్, సింగం అంటూ ప్రజల నుంచి మన్ననలు పొందారు.


