News September 10, 2025
అనకాపల్లి: ‘నేరుగా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలు’

ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన వారందరూ టెన్త్ చదవడానికి అర్హులేనని అన్నారు. టెన్త్లో ఉత్తీర్ణత సాధించి కళాశాలలో చేరకుండా ఉండిపోయిన, మధ్యలో మానేసిన వారు కూడా ఇప్పుడు నేరుగా ఇంటర్ కోర్సులో చేరవచ్చు అన్నారు.
Similar News
News March 13, 2026
కడప: ఇవాళ్టి ఇంటర్ పరీక్షకు 276 మంది డుమ్మా

కడప జిల్లాలో శుక్రవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ ఫిజిక్స్ పేపర్-2 పరీక్షలు జరిగాయి. నేడు 12,141 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 11,865 మంది హాజరయ్యారు. 276 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఇంటర్మీడియట్ అధికారులు వెల్లడించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News March 13, 2026
సంగారెడ్డి: SIR ప్రక్రియ వేగవంతం చేయాలి: సుదర్శన్ రెడ్డి

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పక్కాగా వివరాలు సేకరించేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
News March 13, 2026
NZB: ‘గ్యాస్ సిలిండర్ల విషయంలో ఆందోళన వద్దు’

వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఎవరు కూడా ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో గ్యాస్ కొరత ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. IDOCలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో వంట గ్యాస్ డిమాండ్, సరఫరా తీరుతెన్నులపై ఈ సమావేశంలో సమీక్షించారు.


