News September 10, 2025

జగన్‌ వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ కౌంటర్

image

AP: మెడికల్‌ కాలేజీలపై జగన్‌ <<17624092>>వ్యాఖ్యలకు<<>> మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. తామేమీ మెడికల్‌ కాలేజీలు అమ్మడం లేదని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఎందుకు వాటిని పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అని, ఇందులో పబ్లిక్‌ భాగస్వామ్యం ఉంటుందని వివరించారు. తెలియకపోతే సలహాదారులను అడిగి తెలుసుకోవాలని చురకలు అంటించారు. PPP వలన పేద విద్యార్థులకు నష్టం ఉండదని తెలిపారు.

Similar News

News September 11, 2025

ఇంటర్‌లో ప్రవేశాలు.. రెండు రోజులే ఛాన్స్

image

TG: ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు ఆన్‌లైన్ <>పోర్టల్<<>> ఓపెన్ చేస్తామని బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం రూ.500 ఫైన్ చెల్లించాలని, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు అవసరం లేదని తెలిపారు. స్టూడెంట్స్ ఇప్పటికే సమర్పించిన వివరాల్లో తప్పులనూ సవరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.

News September 11, 2025

నేడు బాపట్ల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యలంకలో తాటి మొక్కలు నాటి ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నగరవనం అటవీ పార్కులో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతో సమావేశమై ఆర్థికసాయం అందజేస్తారు.

News September 11, 2025

వరద బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి: మంత్రి

image

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ‘ప‌రిహారం అందని వారికి వెంట‌నే నిధులు విడుద‌ల చేయండి. బాధితులు ప‌రిహారం కోసం ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి రాకూడదు. చెరువులు, రోడ్ల మ‌ర‌మ్మ‌తులకు ప్రాధాన్య‌త ఇవ్వాలి. తీవ్రంగా దెబ్బ‌తిన్న జిల్లాల‌కు ₹10Cr, ఇతర జిల్లాల‌కు ₹5Cr విడుద‌ల చేశాం’ అని తెలిపారు.