News September 10, 2025

గద్వాల జిల్లాలో పెరుగుతున్న కుక్క కాటు బాధితులు

image

జోగులాంబ గద్వాల జిల్లాలో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 2,000 మంది కుక్కకాటుకు గురై ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారని సమాచారం. పాముకాటుకు గురైన వారి సంఖ్య కూడా 20 వరకు ఉంది. కొన్ని గ్రామాల్లో కోతుల బెడద అధికంగా ఉంది. ప్రజల ప్రాణాలకు ముప్పు రాకముందే రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News September 11, 2025

ఏపీ, తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు టీజీలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

News September 11, 2025

OTTలోకి వచ్చేసిన రజినీకాంత్ ‘కూలీ’

image

రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

News September 11, 2025

ఇంటర్‌లో ప్రవేశాలు.. రెండు రోజులే ఛాన్స్

image

TG: ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు ఆన్‌లైన్ <>పోర్టల్<<>> ఓపెన్ చేస్తామని బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం రూ.500 ఫైన్ చెల్లించాలని, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు అవసరం లేదని తెలిపారు. స్టూడెంట్స్ ఇప్పటికే సమర్పించిన వివరాల్లో తప్పులనూ సవరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.