News September 10, 2025
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*గద్వాల: చాకలి ఐలమ్మ వర్ధంతి.
*లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి.
*పిడుగుపడి ముగ్గురు మృతి. *గట్టు: GPభవన నిర్మాణానికి భూమి పూజ.
*మల్దకల్: కాంగ్రెస్ నేత కు BRSలోకి రావాలని ఆహ్వానం. *అయిజ: గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి *అలంపూర్: నవరాత్రి ఉత్సవాల పోస్టర్ విడుదల.
*మానవపాడు: ఉద్యోగులకు బదిలీలు సహజం.
*ఎర్రవల్లి: ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలు చేయాలి.
*ధరూర్: జూరాల గేట్లు మూసివేత.
Similar News
News March 15, 2026
నల్గొండలో జన గణనకు రెడీ

నల్గొండలో జనగణన కోసం అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. 2011 జనగణన ప్రకారం జిల్లాలో మొత్తం జనాభా 34,88,809. పురుషులు 17,58,772, మహిళలు 17,29,037. తాజా గణనలో సుమారు 16,18,416 కుటుంబాల వివరాలు సేకరించడమే లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో 8,18,306, పట్టణాల్లో 8,00,110 కుటుంబాల నుంచి సమాచారం నమోదు చేయనున్నారు. ఇంటింటి సర్వేకు సిబ్బందికి శిక్షణ ఇచ్చి డిజిటల్ విధానంలో డేటా తీసుకోనున్నారు.
News March 15, 2026
నకిలీ సందేశాలను నమ్మవద్దు : విద్యుత్ శాఖ

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో కోరారు. మీ విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని మెసేజ్లు వస్తున్నాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఒక ఫోన్ నంబరును సంప్రదించాలంటూ సందేశాలు అందుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.
News March 15, 2026
నెల్లూరు: ఉదయాన్నే రామాపురం వద్ద ప్రమాదం

వరికుంటపాడు మండలం రామాపురం జాతీయ రహదారిపై చింతపండు లోడుతో వెళ్తున్న ఐచర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. హిందూపూర్ నుంచి కనిగిరి వైపు చింతపండు లోడుతో వెళ్తుండగా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ దాదా పీర్కి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్ను 108 వాహనంలో ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


