News September 11, 2025
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగవంతం చేయండి: కలెక్టర్

కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఏలూరు జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, అందరికి ఇళ్లు పథకం విచారణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 6.14 లక్షల కార్డుల్లో ఇప్పటి వరకు 4.54 లక్షలు పంపిణీ చేశామన్నారు. మిగిలినవి 2 రోజుల్లో ఇవ్వాలని సూచించారు. 1,390 ఇళ్ల విచారణను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.
Similar News
News September 11, 2025
జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీలకు సిద్దిపేట బిడ్డ

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ (డెహ్రాడూన్)కు సిద్దిపేట బిడ్డ ఎంపికయ్యాడు. హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్లో జరిగిన స్టేట్ లెవెల్ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో జావెలిన్ త్రో ఈవెంట్లో అంబటి రాజు గౌడ్ (AEO,అగ్రికల్చర్ డిపార్ట్మెంట్) మొదటి స్థానం పొంది బంగారు పతకం సాధించారు. ఫిబ్రవరి (2026) డెహ్రాడూన్లో జరిగే జాతీయ స్థాయి ఈవెంట్లో ఆయన పాల్గొననున్నారు.
News September 11, 2025
నేపాల్లో తెలుగువారి కోసం కలెక్టరేట్లో హెల్ప్లైన్

నేపాల్లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఈ సేవలను తక్షణం అందుబాటులోకి తీసుకువచ్చారు. నేపాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులు ఈ నంబర్కు 94912 22122 ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.
News September 11, 2025
‘ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై తనిఖీ చేయాలి’

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.