News September 11, 2025

HYD: ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా జైళ్లు: మంత్రి

image

జైళ్లు నిరాశకు కేంద్రాలుగా కాకుండా, ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా మారాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. “ఏడో ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ – 2025” సందర్భంగా ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం ఏర్పాటు చేసిన ‘కల్చరల్ నైట్’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, మానవత్వంతో కూడిన సంస్కరణలకు వేదికలుగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Similar News

News March 13, 2026

మద్యం విక్రయాల్లో చిత్తూరు జిల్లాకు నాలుగో స్థానం

image

మద్యం విక్రయాలు, ఎక్సైజ్ పన్నుల వసూళ్లలో చిత్తూరు జిల్లా ముందంజలో ఉంది. రూ.819.08 కోట్ల లక్ష్యానికిగానూ రూ.865.08 కోట్లతో (106శాతం) రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. కొత్త పాలసీ రాకముందు జిల్లాలో 18, 682 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేయగా, పాలసీ తర్వాత (అక్టోబరు- ఫిబ్రవరి మధ్య) అది కేవలం 1827 లీటర్లకు తగ్గిపోయింది.

News March 13, 2026

నంద్యాల జిల్లాలో రూ.300కు పెరిగిన ధరలు

image

నంద్యాల జిల్లాలో చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. 15 రోజులుగా చికెన్ ధరలు చుక్కలనంటుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. కిలో చికెన్ ఆయా ప్రాంతాలను బట్టి రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం రూ.200, రూ.220 ఉన్న ధరలు అమాంతం పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

News March 13, 2026

పంత్ మరో అభిషేక్ అవుతాడా?

image

LSG కెప్టెన్ రిషభ్ పంత్ గత IPL సీజన్‌లో బ్యాటింగ్‌లో తడబడిన సంగతి తెలిసిందే. RCBపై సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో రాణించలేకపోయారు. దీంతో ఈసారి యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల 4 రోజులపాటు ముంబైలో బ్యాటింగ్ సెషన్లు జరిగాయి. గతంలో అభిషేక్ శర్మ, గిల్, ప్రభ్‌సిమ్రాన్ వంటి బ్యాటర్లకు యువీ శిక్షణనిచ్చారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌లా పంత్ రాణిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.