News September 11, 2025
నేటి ముఖ్యాంశాలు

* దసరా రోజున ఆటోడ్రైవర్లకు రూ.15,000: CM
* నేపాల్లో ఉన్న ఏపీ వారిని ప్రత్యేక విమానంలో తరలింపు: లోకేశ్
* చంద్రబాబు బావిలో దూకి చావాలి: జగన్
* TG: గత పాలకులు దోచుకున్న సొమ్ము రికవరీ చేస్తాం: కోమటిరెడ్డి
* రేవంత్ బీజేపీ సీఎం అని ముస్లింలు గుర్తించాలి: KTR
* కిషన్రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తా: రాజాసింగ్
*ఆసియా కప్లో భారత్ బోణీ.. UAEపై ఘన విజయం
Similar News
News March 5, 2026
OTTలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఎప్పుడంటే?

రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 59 రోజుల తర్వాత OTTలో స్ట్రీమింగ్కు వస్తోంది.
News March 5, 2026
బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

CM పదవికి నితీశ్ కుమార్ <<19296674>>రాజీనామా<<>> చేసి RSకు వెళ్తారనే ప్రచారం రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత NDAలో కీలక భాగస్వామిగా మారిన నితీశ్కు కేంద్ర క్యాబినెట్లో పదవి దక్కుతుందని గతంలోనే వార్తలొచ్చాయి. కానీ BJP ఆ ప్లాన్ను వెంటనే అమలుచేయలేదు. ఇప్పుడు నితీశ్ను కేంద్రమంత్రి చేసి, బిహార్లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో CM పోస్ట్ BJP ఖాతాలో చేరనుంది.
News March 5, 2026
ఇరాన్తో యుద్ధం.. 10కి 15 మార్కులేసిన ట్రంప్

ఇరాన్పై చేస్తున్న యుద్ధంలో అమెరికా మిలిటరీ అసామాన్యంగా పోరాడుతోందని ట్రంప్ కొనియాడారు. ఈ సందర్భంగా తమ దేశ సైన్యానికి 10కి 15 మార్కులేశారు. తమతో పాటు ఇరాన్పై యుద్ధం చేస్తున్న మిత్రదేశాలు ఇప్పటికే పైచేయి సాధించాయని చెప్పారు. ప్రస్తుతం తాము కమాండింగ్ పొజిషన్లో ఉన్నామన్నారు. ఈ యుద్ధంలో వెయ్యి మందికి పైగా ఇరానియన్స్ చనిపోయినట్లు US హ్యూమన్ రైట్స్ గ్రూప్ చెబుతోంది.


