News September 11, 2025
నిర్మల్ రూరల్: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: మంత్రి

మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వా లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.
Similar News
News March 14, 2026
కామారెడ్డి: ఒకేషనల్ పరీక్షలకు 91.37 శాతం హాజరు

కామారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఒకేషనల్ పరీక్షలకు 91.37 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. మొత్తం 1,738 మంది విద్యార్థులకు గాను 1,588 మంది హాజరు కాగా, 150 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు పకడ్బందీగా, నిబంధనల ప్రకారం జరిగాయని ఆయన వివరించారు.
News March 14, 2026
ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ రాజబాబు శనివారం తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, గ్యాస్ కొరత సృష్టించినా, అక్రమ నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఏర్పడితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 1077 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వినియోగదారులకు సూచించారు.
News March 14, 2026
MHBD: పరీక్ష కోసం తల్లిదండ్రుల మరణ వార్తను దాచారు!

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గన్యచక్ర తండాకు చెందిన <<19379355>>సోములు, మంగమ్మ దంపతులు HYD పటాన్చెరులో హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. కాగా హత్యకు గురైన తల్లిదండ్రుల విషయం తెలిస్తే బాలిక పరీక్షపై ప్రభావం పడుతుందని భావించిన గ్రామస్థులు, పరీక్ష పూర్తయ్యే వరకు విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. పరీక్ష ముగించుకుని ఇంటికి వచ్చిన బాలికకు విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యింది.


