News September 11, 2025

బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8: అన్నమయ్య కలెక్టర్

image

ఇవాళ్టి బొప్పాయి ధరలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో తెలిపారు. టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8, సెకండ్ గ్రేట్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.7గా నిర్ణయించామన్నారు. ట్రేడర్లు తక్కువ ధరకు తీసుకుంటే వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమును (9573990331, 9030315951) సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.

Similar News

News September 11, 2025

నేపాల్‌లో తెలుగువారి కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్

image

నేపాల్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఈ సేవలను తక్షణం అందుబాటులోకి తీసుకువచ్చారు. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు ఈ నంబర్‌కు 94912 22122 ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.

News September 11, 2025

‘ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై తనిఖీ చేయాలి’

image

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.

News September 11, 2025

ప్రాంతీయ పార్టీల ఇన్‌కమ్ రిపోర్ట్.. టాప్‌లో BRS

image

2023-24 FYలో దేశంలోని 40 ప్రాంతీయ పార్టీలు ₹2,532 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయని ADR నివేదిక తెలిపింది. ఇందులో 83% విరాళాల ద్వారా వచ్చినట్లు పేర్కొంది. ఈ లిస్టులో ₹685.51 కోట్లతో BRS టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో TMC ₹646.39Cr, BJD ₹297Cr, TDP ₹285Cr, YCP ₹191Cr ఉన్నాయి. మొత్తం పార్టీల ఆదాయంలో ఈ 5 పార్టీల ఆదాయమే 83.17% ఉన్నట్లు పేర్కొంది. కాగా 40 పార్టీల ఖర్చుల మొత్తం ₹1,320Crగా ఉంది.