News September 11, 2025
వనపర్తి: ఇంటర్ ప్రవేశాలు.. ఈనెల 12 వరకు ఛాన్స్

వనపర్తి జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 12 వరకు అవకాశం కల్పించినట్లు డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా, ప్రైవేట్ కళాశాలల్లో రూ. 500 అపరాధ రుసుముతో ప్రవేశాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అడ్మిషన్ పొందకుండా ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 11, 2025
ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలి: అనకాపల్లి డీఈవో

ఓపెన్ స్కూల్ ద్వారా దూరవిద్య విధానంలో పదవ తరగతి, ఇంటర్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అప్పారావు నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 14 ఏళ్ళు నిండినవారు పదవ తరగతిలో చేరి సెలవు దినాల్లో శిక్షణ పొంది పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. పదవ తరగతి పాస్ అయిన వారు కళాశాలలో చేరకుండా నేరుగా ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పరీక్షలు రాయవచ్చునని అన్నారు.
News September 11, 2025
MBNR:జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్లు @4,99,852

మహబూబ్నగర్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఓటర్ల లెక్క తేలింది. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 175 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 930 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జడ్పీ సీఈవో వెంకట రెడ్డి బుధవారం తెలిపారు. మొత్తం 4,99,852 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 2,48,222, మహిళలు 2,51,349, ఇతరులు 11 మంది ఉన్నారు. పురుషులకంటే 3,127 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
News September 11, 2025
వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి మొదటి దర్శనం

వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి కుమ్మరివారి ఇంటి నుంచి అమ్మవారి ప్రతిమను మెట్టినిల్లు అయిన చాకలివారి ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ దిష్టి చుక్క, కళ్లు పెట్టారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆపై ఊరేగింపుగా పోలేరమ్మ ప్రధాన గుడి వద్దకు తీసుకు వచ్చి ప్రతిష్టించారు. నయన మనోహరంగా ఉన్న పోలేరమ్మను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు.