News September 11, 2025
సంగారెడ్డి: జిల్లాలో 7,44,157 మంది ఓటర్లు

జిల్లాలోని 613 పంచాయతీల్లో 7,44,157 మంది ఓటర్ల ఉన్నారని జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం 1458 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 25 జడ్పీటీసీ, 221 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు వివరించారు.
Similar News
News March 23, 2026
ఆగిరిపల్లి: టీచర్లకు బెదిరింపు కాల్స్

ఆగిరిపల్లి మండలంలో ఉపాధ్యాయులను బెదిరించిన ఫేక్ అధికారుల ఫోన్ కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఈవో వెంకట లక్ష్మమ్మ ఆదేశించారు. ఎంఈఓ హేబేలు మాట్లాడుతూ.. సూరవరం జడ్పీ హై స్కూల్స్ హెచ్ఎంలకు మధ్యాహ్నం భోజన పథకంలో అవకతవకలు జరిగాయని బెదిరిస్తూ అధికారుల పేరుతో ఫేక్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు చెప్పారు. సమాచారం తెలుసుకున్న డీఈవో ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించినట్లు వివరించారు.
News March 23, 2026
ధర్మవరం: భార్య పుట్టింటికి.. మనస్తాపంతో సూసైడ్!

భార్య కాపురానికి రాలేదని మనస్తాపంతో ధర్మవరం(M) గొట్లూరుకు చెందిన శ్రీనివాసులు(35) ఆత్మహత్య చేసుకున్నట్లు SI రాజశేఖర్ తెలిపారు. ఈయన స్వచ్ఛభారత్ కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. ముదిగుబ్బ(M) సిరిగారిపల్లికి చెందిన నందినితో వివాహమైంది. మద్యానికి బానిసవ్వడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. 4 రోజుల క్రితం భార్య కోసం వెళ్లగా ఆమె రాలేదు. దీంతో సూసైడ్ చేసుకున్నాడు. ఇతని మొదటి భార్య కొన్నేళ్ల కిందట మరణించింది.
News March 23, 2026
వరాహస్వామికి వేంకన్న ఇచ్చిన మాట.. నేటీకీ అమలు!

అప్పుడు <<19452438>>వేంకన్న<<>> ధనంకన్నా విలువైన మాటను ఇచ్చెదని తెలిపారట. ‘నా దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి, నిన్ను దర్శించుకుంటారు. నిత్యం నీకు పాలతో అభిషేకం, నైవేద్యం సమర్పిస్తారు’ అని వాగ్ధానం చేశారట. దీంతో వరాహ స్వామి తన క్షేత్రంలో 100 అడుగుల స్థలాన్ని శ్రీహరికి ఇచ్చారట. అప్పటి నుంచి నేటి వరకు సుప్రభాతం మొదలుకొని అన్ని నిత్య సేవలు వరాహ మూర్తికి ఆయన తరువాతే వేంకన్నకు చేస్తున్నారు.


