News September 11, 2025

కామారెడ్డి: హైవేపై 26 గొర్రెలు మృతి

image

కామారెడ్డి మండలంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి నారాయణపేట జిల్లా మరికల్‌కు చెందిన గుడికండ్ల రామప్పగా, గాయపడిన మరో గొర్రెల కాపరి బసాయిల మల్లేష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ వెల్లడించారు. గొర్రెలకు పశుగ్రాసం నిమిత్తం ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డారు.

Similar News

News September 11, 2025

కామారెడ్డి: పరిషత్ పోరుకు ఓటర్ల లెక్క తేలింది..!

image

కామారెడ్డి జిల్లాలో పరిషత్ ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు 25 ZPTC, 233 MPTC స్థానాలకు తుది ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు బుధవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 6,39,730 మంది ఓటర్లతో పాటు 1,2590 పోలింగ్ స్టేషన్లను ప్రకటించారు. స్థానిక పోరుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.. ఎన్నికల తేదీలే ప్రకటించాల్సి ఉంది.

News September 11, 2025

విజయవాడ: ఆ ఆసుపత్రిలో ఎక్విప్‌మెంట్ ఫుల్.. సిబ్బంది నిల్

image

రాణిగారితోటలోని పట్టణ ప్రాధమిక ఆరోగ్యకేంద్ర సేవలకు సిబ్బంది కొరత వేధిస్తోంది. ల్యాబ్ టెక్నిషియన్, డాక్టర్, ఫార్మసిస్ట్ లేకపోవడంతో ప్రస్తుతం ఇద్దరు స్టాఫ్ నర్సులే ఈ కేంద్రానికి వచ్చే రోగులకు సేవలు అందిస్తున్నారు. ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మసిస్ట్ లేకపోవడంతో రూ.లక్షల విలువైన ఎక్విప్‌మెంట్ ఉన్నా వ్యాధినిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. ప్రభుత్వం స్పందించి సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

News September 11, 2025

పాక్‌తో మ్యాచ్.. ఆసక్తి చూపని IND ఫ్యాన్స్?

image

INDvsPAK మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. మ్యాచ్ ఎక్కడ జరిగినా క్షణాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. అయితే UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈనెల 14న జరిగే దాయాదుల మ్యాచ్‌పై భారతీయులు ఆసక్తి చూపించట్లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచుకు మరో 2 రోజులే ఉన్నా టికెట్స్ ఇంకా సేల్ అవలేదట. పహల్గామ్ అటాక్ కారణంగా PAKతో మ్యాచ్‌పై భారతీయులు ఆసక్తిగా లేరని అంటున్నాయి.