News September 11, 2025
కామారెడ్డి: హైవేపై 26 గొర్రెలు మృతి

కామారెడ్డి మండలంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి నారాయణపేట జిల్లా మరికల్కు చెందిన గుడికండ్ల రామప్పగా, గాయపడిన మరో గొర్రెల కాపరి బసాయిల మల్లేష్గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ వెల్లడించారు. గొర్రెలకు పశుగ్రాసం నిమిత్తం ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డారు.
Similar News
News March 16, 2026
పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు: డీఈవో

మచిలీపట్నంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను డీఈవో యు.వి. సుబ్బారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిలకలపూడి సీపీఎం హైస్కూల్, నిర్మల, హైని, శ్రీ బాలాజీ, ఎంఈకే బాలాభాను తదితర పాఠశాలల్లో పరీక్షల సరళిని పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన వసతులను సమీక్షించిన ఆయన, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News March 16, 2026
ఖమ్మం: KU డిగ్రీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఏప్రిల్-2026 సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. BA, B.Com, B.Sc, BBA, BCA, B.Voc, BHM & CT తదితర కోర్సుల II, IV, VI సెమిస్టర్(రెగ్యులర్/బ్యాక్లాగ్) అలాగే I, III, V సెమిస్టర్ బ్యాక్లాగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 4 వరకు, రూ.50 లేట్ ఫీజుతో ఏప్రిల్ 9 వరకు తమ తమ కళాశాలల్లో చెల్లించాలి.
News March 16, 2026
ఈనెల 25తో ముగియనున్న రైతన్న మీ కోసం: JC

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె కర పత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 25తో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా సంపద సృష్టించే దిశగా రైతులు అడుగులు వేయాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. డీఆర్ఓ గంగాధర్ గౌడ్ ఉన్నారు.


