News September 11, 2025
శ్రమకు సెల్యూట్.. ఆకాశమంత ఎత్తులో కూలీల కష్టం!

కూటి కోసం కోటి విద్యలు అన్న నానుడి తెలిసిందే. ప్రాణాలకు తెగించి పనిచేస్తూ పొట్ట నింపుకునే వారు ఎందరో ఉన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఆ పని వెనుక ఉన్న శ్రమ తెలుసు. అయితే నంద్యాల జిల్లా గడివేముల మండలంలో 760 కేవీ విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయి. కొంతమంది శ్రామికులు ఆకాశమంత ఎత్తులో విద్యుత్ వైర్ల పనులు చేస్తున్న దృశ్యాన్ని Way2News క్లిక్ మనిపించింది. ఈ చిత్రం శ్రమైక్య జీవన సౌందర్యానికి నిదర్శనం.
Similar News
News September 11, 2025
విజయవాడ: ఆ ఆసుపత్రిలో ఎక్విప్మెంట్ ఫుల్.. సిబ్బంది నిల్

రాణిగారితోటలోని పట్టణ ప్రాధమిక ఆరోగ్యకేంద్ర సేవలకు సిబ్బంది కొరత వేధిస్తోంది. ల్యాబ్ టెక్నిషియన్, డాక్టర్, ఫార్మసిస్ట్ లేకపోవడంతో ప్రస్తుతం ఇద్దరు స్టాఫ్ నర్సులే ఈ కేంద్రానికి వచ్చే రోగులకు సేవలు అందిస్తున్నారు. ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మసిస్ట్ లేకపోవడంతో రూ.లక్షల విలువైన ఎక్విప్మెంట్ ఉన్నా వ్యాధినిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. ప్రభుత్వం స్పందించి సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
News September 11, 2025
పాక్తో మ్యాచ్.. ఆసక్తి చూపని IND ఫ్యాన్స్?

INDvsPAK మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. మ్యాచ్ ఎక్కడ జరిగినా క్షణాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. అయితే UAEలో జరుగుతోన్న ఆసియా కప్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈనెల 14న జరిగే దాయాదుల మ్యాచ్పై భారతీయులు ఆసక్తి చూపించట్లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచుకు మరో 2 రోజులే ఉన్నా టికెట్స్ ఇంకా సేల్ అవలేదట. పహల్గామ్ అటాక్ కారణంగా PAKతో మ్యాచ్పై భారతీయులు ఆసక్తిగా లేరని అంటున్నాయి.
News September 11, 2025
భారీ వర్షం.. జానంపేటలో అత్యధికం

మహబూబ్నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మూసాపేట మండలంలోని జానంపేటలో అత్యధికంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడ్డాకులలో 33.5, దేవరకద్రలో 31.5, చిన్నచింతకుంటలో 22.0, మహమ్మదాబాద్లో 11.0, కోయిలకొండలో 4.5, మహబూబ్నగర్ అర్బన్లో 3.5, కౌకుంట్లలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.