News September 11, 2025

వరద బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి: మంత్రి

image

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ‘ప‌రిహారం అందని వారికి వెంట‌నే నిధులు విడుద‌ల చేయండి. బాధితులు ప‌రిహారం కోసం ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి రాకూడదు. చెరువులు, రోడ్ల మ‌ర‌మ్మ‌తులకు ప్రాధాన్య‌త ఇవ్వాలి. తీవ్రంగా దెబ్బ‌తిన్న జిల్లాల‌కు ₹10Cr, ఇతర జిల్లాల‌కు ₹5Cr విడుద‌ల చేశాం’ అని తెలిపారు.

Similar News

News September 11, 2025

ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం ఉ.9.30 గం.కు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం సాయంత్రం అమరావతికి తిరిగి రానున్నారు.

News September 11, 2025

NCLTలో 32 పోస్టులు

image

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(<>NCLT<<>>) స్టెనోగ్రాఫర్ 18, ప్రైవేట్ సెక్యూరిటీస్ 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైన కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ నాలెడ్జ్ గల అభ్యర్థులు అక్టోబర్ 8వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.45వేలు, ప్రైవేట్ సెక్యూరిటీకి రూ.50వేలు జీతం అందిస్తారు. వెబ్ సైట్: https://nclt.gov.in/

News September 11, 2025

పెట్టుపోతలకు చెక్ పెడదాం

image

మనదేశంలో చాలా పోరాటాల తర్వాత 1961లో వరకట్ననిషేధ చట్టం వచ్చింది. ఇందులో సెక్షన్ 2 ప్రకారం పెళ్లిలో విలువైన వస్తువులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీసుకుంటే అది భార్య, వారసుల కోసమే వాడాలి. సెక్షన్ 3 ప్రకారం కట్నం తీసుకున్నట్లు రుజువైతే ఫైన్, జైలుశిక్ష పడుతుంది. సెక్షన్ 4 ప్రకారం కట్నం డిమాండ్ చేయడం నేరం. సెక్షన్ 6 ప్రకారం పెళ్లిలో తీసుకున్న ఆస్తి, డబ్బు 3నెలల్లో అమ్మాయి పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయాలి.