News September 11, 2025
మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించింది పింక్ డైమండ్ కాదు: ASI

తిరుమల శ్రీవారికి 1945లో మైసూరు మహారాజు జయచామరా రాజేంద్ర వడియార్ సమర్పించింది పింక్ డైమండ్ కాదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆలయంలోని పింక్ డైమండ్ మాయమైందని 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేయడంతో దీనిపై ASI అధ్యయనం చేసింది. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది హారం అని, అందులో కెంపులు, రత్నాలు మాత్రమే ఉన్నాయని ASI డైరెక్టర్ వెల్లడించారు.
Similar News
News September 11, 2025
విటమిన్ డి లోపం ఉంటే ఇవి తీసుకోండి

శరీరంలో హెల్తీబోన్స్కు కావాల్సిన కాల్షియం, ఫాస్పరస్ను గ్రహించడంలో విటమిన్ డి సాయపడుతుంది. కొవ్వును కరిగించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పని చేయడానికి, గుండె, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి విటమిన్ డి అవసరం. దీనికోసం ఆవు పాలు, పెరుగు వంటి ఫోర్టిఫైడ్ ఫుడ్స్, ఛీజ్, గుడ్డులోని పచ్చసొన తీసుకోవాలి. వీటితోపాటు లో ఫ్రీక్వెన్సీ సన్లైట్లో ఉంటే విటమిన్ డి లభిస్తుంది.
News September 11, 2025
మగువల కోసం బ్యూటీ టిప్స్

* యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన నీటిలో పాదాలను 30 నిమిషాలు ఉంచితే పాదాల దుర్వాసన, పగుళ్లు, మడమ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
* 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో కాస్త నీటిని కలిపి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ను మెడపై అప్లై చేసి 5 నిమిషాల తర్వాత తడి వేళ్లతో స్క్రబ్ చేసి నీటితో కడిగితే మెడపై డార్క్ ట్యాన్ పోతుంది.
* ఐస్ క్యూబ్స్తో ముఖంపై రబ్ చేస్తే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.
News September 11, 2025
మైథాలజీ క్విజ్ – 3

1. అర్జునుడి విల్లు పేరేంటి?
2. యమధర్మరాజు తండ్రి ఎవరు?
3. చైత్ర మాసంలో నవమి నాడు వచ్చే పండుగ ఏది?
4. ఏ రాష్ట్రంలో ఎక్కువ జ్యోతిర్లింగాలు ఉన్నాయి?
5. సంతానం కోసం దశరథుడు ఏ యాగం చేశాడు?
6. అనసూయకు త్రిమూర్తుల అంశతో ఎవరు జన్మించారు?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.