News September 11, 2025

రాజమండ్రి: ఈ నెల 12న ఉద్యోగ మేళా

image

తూ.గో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణం వద్ద ఈనెల 12న జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి 19 నుంచి 30 సంవత్సరాలలోపు వయసుగల వారు అర్హులని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 11, 2025

“స్ఫూర్తి పథం” కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి “స్ఫూర్తి పథం” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి 213 ప్రభుత్వ హైస్కూళ్లలోని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మరింత అవగాహన కల్పించనున్నారు.

News September 11, 2025

‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఎక్కిన దివాన్ చెరువు కుర్రోడు

image

రాజానగరం మండలం దివాన్ చెరువుకు చెందిన సూక్ష్మ కళాకారుడు బబ్లు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించాడు. 5 లక్షల బియ్యం గింజలతో ప్రేమానంద్ మహారాజ్ చిత్రాన్ని వేసి ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటికే 2 లక్షల ధాన్యం గింజలతో బాలాజీ చిత్రాన్ని వేసి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ చోటు దక్కించుకున్నాడు. బబ్లు తండ్రి పానీపూరీ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

News September 11, 2025

చట్ట వ్యతిరేక శక్తులపై ఎస్పీ సీరియస్

image

పోలీసులపై దాడి చేసిన ఘటనను ఎస్పీ నరసింహ కిషోర్ సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో చట్ట వ్యతిరేక శక్తులను అరికట్టేందుకు 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడి జరిగిన తర్వాత జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రికార్డులు సరిగా లేని 90 వాహనాలపై కేసులు నమోదు చేశారు. 23 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 110 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయి.