News September 11, 2025
జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీలకు సిద్దిపేట బిడ్డ

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ (డెహ్రాడూన్)కు సిద్దిపేట బిడ్డ ఎంపికయ్యాడు. హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్లో జరిగిన స్టేట్ లెవెల్ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో జావెలిన్ త్రో ఈవెంట్లో అంబటి రాజు గౌడ్ (AEO,అగ్రికల్చర్ డిపార్ట్మెంట్) మొదటి స్థానం పొంది బంగారు పతకం సాధించారు. ఫిబ్రవరి (2026) డెహ్రాడూన్లో జరిగే జాతీయ స్థాయి ఈవెంట్లో ఆయన పాల్గొననున్నారు.
Similar News
News March 18, 2026
VZM: దేవాలయాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఉగాది, రంజాన్ పండగలను మతసామరస్యంతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రజలకు సూచించారు. వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద విషయాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. పండగల సందర్భంగా దేవాలయాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని అధికారులకు బుధవారం ఆదేశించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 18, 2026
కందుకూరు లేఅవుట్ పనులు జూన్ లోపు పూర్తి చేయాలి: జేసీ

అనంతపురం రూరల్ పరిధిలోని కందుకూరు అహుడా లేఅవుట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జేసీ విష్ణుచరణ్ పరిశీలించారు. డ్రైనేజీలు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా, పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ నెలలోపు అన్ని పనులు పూర్తి చేయాలని, పక్షం రోజులకు ఒకసారి పురోగతి నివేదిక సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో అహుడా అధికారులు పాల్గొన్నారు.
News March 18, 2026
బాపట్ల: ఇంటర్ పరీక్షకు 154 మంది గైర్హాజరు

బాపట్ల జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 154 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జుబేర్ పేర్కొన్నారు. బుధవారం ఇంటర్ పరీక్షకు 7,670 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 7,516 మంది మాత్రమే హాజరయ్యారన్నారు మిగిలిన 154 మంది పరీక్షకు హాజరు కాలేదన్నారు. జిల్లాలో బుధవారం నాడు ఇంటర్ పరీక్ష ఎటువంటి కాపీయింగ్ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందన్నారు.


