News September 11, 2025

నేడు అనకాపల్లిలో మెగా జాబ్ మేళా

image

అనకాపల్లి రాజా థియేటర్ వద్ద గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్.గోవిందరావు బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో 20 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ చేసి 18 నుంచి 35 ఏళ్ల వయసుగల యువతీ యువకులు అర్హులుగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు.

Similar News

News April 5, 2026

ఉప్పల్‌లో SRHకు అదిరిపోయే రికార్డులు!

image

IPL: హోంగ్రౌండ్ ఉప్పల్‌లో SRH తన పర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఊర్రూతలూగిస్తూనే ఉంటుంది. 2013 నుంచి ఈ గ్రౌండులో ఆ జట్టు 63 మ్యాచులు ఆడగా 38 విజయాలను సొంతం చేసుకుంది. విన్నింగ్ పర్సెంటేజ్ 61కి పైనే ఉంది. మరోవైపు లీగ్‌లో ఇప్పటి వరకు నమోదైన రెండో అత్యధిక స్కోర్(286) గత సీజన్లో RRపై చేసింది. 2025లోనే పంజాబ్ జట్టుపై 247 పరుగులనూ ఛేదించింది. ఇక ఉప్పల్‌లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే 57% గెలవడం గమనార్హం.

News April 5, 2026

నరసన్నపేట: కల్తీ ఆహారంపై కనికరమేల..?

image

నరసన్నపేటలో నాణ్యతలేని ఆహార విక్రయాలు భారీగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మిల్క్ షేక్, హోటల్స్, స్వీట్ స్టాల్స్, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలలో నాణ్యతా ప్రమాణాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల సింగపురంలో జరిగిన కల్తీ బాదంపాలు ఘటన అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

News April 5, 2026

NLG: సెల్‌ఫోన్ పక్కనపెట్టి.. లైబ్రరీకి వెళ్దాం!

image

స్మార్ట్‌ఫోన్ల వ్యసనంతో పిల్లల్లో పుస్తక పఠనం తగ్గి ఆలోచనా శక్తి దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి సెలవులు, ఒంటిపూట బడుల నేపథ్యంలో పిల్లల సమయం వృథా కాకుండా వారిని గ్రంథాలయాలకు పంపాలని సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండలోని 3 జిల్లా, 64 శాఖా గ్రంథాలయాల్లో ఏకంగా 1,07,951 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు ఈ విజ్ఞాన భాండాగారాలను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.