News April 4, 2024
మరికొన్ని గంటల్లో పెళ్లి.. వరుడు మృతి

మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా వరుడు చనిపోయిన ఘటన రామన్నపేట మం. కక్కిరేణిలో జరిగింది. యాదయ్య, అంజమ్మ దంపతుల పెద్ద కుమారుడు నవీన్కు ఉత్తటూరుకు చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. కాగా నవీన్ నిన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పెళ్లి కొడుకును చేసే టైం అవుతున్నా.. నవీన్ లేకపోవడంతో వెతకగా పొలం వద్ద విగతజీవిగా ఉన్నాడు. నవీన్ మృతి పెళ్లింట తీవ్ర విషాదం నింపింది.
Similar News
News March 28, 2026
NLG: ముందస్తుగా పాఠ్య పుస్తకాలు.. ఈసారి బార్కోడ్!

జిల్లాలో పాఠశాలల ప్రారంభం నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 5.60 లక్షల పుస్తకాలు అవసరం కాగా..ఇందులో ఇప్పటి వరకు 1.64 లక్షల పుస్తకాలు ఇప్పటికే చేరాయి. పుస్తకాల సరఫరాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ప్రతీ పుస్తకానికి ప్రత్యేక కేటాయించి నమోదు చేస్తున్నారు.
News March 27, 2026
మిర్యాలగూడ పార్లమెంటు స్థానంపై చర్చ..!

నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో మిర్యాలగూడ పార్లమెంటు స్థానాన్ని పునరుద్ధరించాలని చర్చ మొదలైంది. 2008లో ఈ స్థానాన్ని నల్గొండలో కలిపిన సంగతి తెలిసిందే. 1962 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడను తిరిగి లోక్సభ స్థానంగా మార్చాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
News March 27, 2026
NLG: వేసవిలో విద్యుత్ కష్టాలకు చెక్.. ‘పవర్’ ఫుల్ ప్లాన్

వేసవిలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా నల్గొండ జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాధారణంగా రోజుకు 15 మిలియన్ యూనిట్ల వాడకం ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో ఇది 22 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా. లోడ్ తట్టుకునేందుకు సబ్స్టేషన్లలో అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో సామర్థ్యాన్ని పెంచారు.


