News September 11, 2025
VZM: ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో వీడియో కాన్ఫెరెన్స్

విజయనగరం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి బబిత ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వచ్చేనెల 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను న్యాయవాదులు విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు, అన్ని సివిల్ దావాలు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకు, తదితర కేసులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.
Similar News
News September 11, 2025
మహిళలు ముందుండాలి: కలెక్టర్ పి. ప్రశాంతి

హుకుంపేటలోని జిల్లా సమాఖ్య కార్యాలయంలో గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ పి. ప్రశాంతి హాజరయ్యారు. రెండు దశాబ్దాలుగా స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరులో వచ్చిన మార్పులను ఆమె కొనియాడారు. ఆర్థిక సాధికారతతో పాటు, సామాజిక మార్పులోనూ మహిళలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.
News September 11, 2025
VZM: సంకల్ప్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం

సంకల్ప్ 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూషన్లో చట్టాలపై గురువారం అవగాహన కల్పించారు. వన్ స్టాప్ సెంటర్, శక్తిసాధన, సఖి నివాసం, 181 ఉమెన్ హెల్ప్లైన్, 1098 చైల్డ్ హెల్ప్లైన్, లింగ సమానత్వం, పోషణ, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
News September 11, 2025
HYD: సా.7 వరకు వర్షం కురిసే ఛాన్స్!

సిటీతో పాటు శివారులో ఇప్పటికే వర్షం కురుస్తోంది. ఈ వర్షం సా.7 గంటల వరకు కొనసాగి అవకాశం ఉన్నట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్, శేర్లింగంపల్లి, కీసర, ఘట్కేసర్, ORR పరిసర ప్రాంతాల్లోనూ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ఇందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండటం మంచిదన్నారు.