News September 11, 2025
మైలవరం: కుమార్తెను హత్య చేసిన తండ్రి

శాంతినగర్కు చెందిన బాజీకి ఇద్దరు భార్యలు. గంజాయి కేసులో రెండో భార్య జైలుకు వెళ్లగా, ఆమె కుమార్తె గాయత్రి(14) మొదటి భార్య నాగమణితో కలిసి ఉంటోంది. ఈ నెల 3న గాయత్రి పెద్దమ్మ, తన తమ్ముడు బాజీ కూతురును హత్య చేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు బాజీని ప్రశ్నించగా, తానే హత్య చేసి, మృతదేహాన్ని చెరువులో పడేసినట్లు అంగీకరించాడు. పోలీసులు బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.
Similar News
News March 15, 2026
శ్రీరామనవమి నాడు ‘భద్రగిరి గిరిజన మార్ట్’ ప్రారంభం

గిరిజన మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా శ్రీరామనవమి నాడు భద్రగిరి మార్ట్ ప్రారంభించనున్నట్లు APO డేవిడ్ రాజ్ వెల్లడించారు. ఆదివారం స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ.. మార్ట్ విజయవంతానికి వ్యాపారులు తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజలకు నిత్యం అవసరమయ్యే సరుకుల జాబితాను సిద్ధం చేయాలని కోరారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తూనే, నాణ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచుతామన్నారు.
News March 15, 2026
వలిగొండ: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

వలిగొండ-తిరుమలగిరి ప్రధాన రహదారిపై యాదాద్రి జిల్లా అరూరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు ప్రారంభించారు.
News March 15, 2026
శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 1,800 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పోలీస్ పాయింట్లు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్క పోలీసు భక్తుల సేవలో నిమగ్నమై పనిచేస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.


