News September 11, 2025

మైలవరం: కుమార్తెను హత్య చేసిన తండ్రి

image

శాంతినగర్‌కు చెందిన బాజీకి ఇద్దరు భార్యలు. గంజాయి కేసులో రెండో భార్య జైలుకు వెళ్లగా, ఆమె కుమార్తె గాయత్రి(14) మొదటి భార్య నాగమణితో కలిసి ఉంటోంది. ఈ నెల 3న గాయత్రి పెద్దమ్మ, తన తమ్ముడు బాజీ కూతురును హత్య చేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు బాజీని ప్రశ్నించగా, తానే హత్య చేసి, మృతదేహాన్ని చెరువులో పడేసినట్లు అంగీకరించాడు. పోలీసులు బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Similar News

News September 11, 2025

మహిళలు ముందుండాలి: కలెక్టర్ పి. ప్రశాంతి

image

హుకుంపేటలోని జిల్లా సమాఖ్య కార్యాలయంలో గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ పి. ప్రశాంతి హాజరయ్యారు. రెండు దశాబ్దాలుగా స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరులో వచ్చిన మార్పులను ఆమె కొనియాడారు. ఆర్థిక సాధికారతతో పాటు, సామాజిక మార్పులోనూ మహిళలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.

News September 11, 2025

VZM: సంకల్ప్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం

image

సంకల్ప్ 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూషన్‌లో చట్టాలపై గురువారం అవగాహన కల్పించారు. వన్ స్టాప్ సెంటర్, శక్తిసాధన, సఖి నివాసం, 181 ఉమెన్ హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, లింగ సమానత్వం, పోషణ, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

News September 11, 2025

HYD: సా.7 వరకు వర్షం కురిసే ఛాన్స్!

image

సిటీతో పాటు శివారులో ఇప్పటికే వర్షం కురుస్తోంది. ఈ వర్షం సా.7 గంటల వరకు కొనసాగి అవకాశం ఉన్నట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్, శేర్లింగంపల్లి, కీసర, ఘట్కేసర్, ORR పరిసర ప్రాంతాల్లోనూ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ఇందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండటం మంచిదన్నారు.