News September 11, 2025

సిద్దిపేట: లెక్క తేలింది.. ఎన్నికలే తరువాయి

image

సిద్దిపేట జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓటరు జాబితాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,55,958 మంది ఉండగా.. పురుషులు 3,21,766, మహిళలు 3,34,186, ఇతరులు ఆరుగురు ఉన్నట్లు జడ్పీ సీఈవో రమేశ్ బుధవారం తెలిపారు. కోహెడ మండలం అత్యధికంగా, దుళ్మిట్టలో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 26 జడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 1,291 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Similar News

News March 24, 2026

యువతా.. దేశ రాజకీయం మార్చేందుకు సిద్ధమా?

image

రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువత, మహిళలకు గోల్డెన్ ఛాన్స్. నియోజకవర్గాల పునర్విభజనతో దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు <<19460921>>భారీగా<<>> పెరగనున్నాయి. దీంతో విస్తృత అవకాశాలు రానున్నాయి. దేశ దిశను మార్చాలనే సంకల్పం ఉన్నవారు ప్రజాక్షేత్రంలోకి దిగండి. కొత్త ఆలోచనలు, సరికొత్త భావజాలాలను ప్రజలకు పరిచయం చేసి వారి మెప్పు పొందండి. ‘నేపాల్‌’ను గెలిచిన Gen Z స్ఫూర్తితో ముందుకు కదలండి.

News March 24, 2026

విజయవాడలో ఉగ్రమూలాలు.. ముగ్గురు అరెస్ట్

image

AP: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో విజయవాడలో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. మొహ్మద్‌ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్‌ బేగ్, మొహ్మద్‌ డానిష్‌ అనే ఈ నిందితులు సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలంవైపు ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు పది మంది దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్‌ నడిపిస్తున్నారని.. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 24, 2026

సిరిసిల్ల: తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయి.. ఆందోళన వద్దు!

image

జిల్లాలో గ్యాస్ నిల్వలు తగినంత ఉన్నాయని జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసిన 25 రోజులు, అలాగే రూరల్ పరిధిలో 45 రోజులలోపు గ్యాస్ సిలిండర్లు డెలివరీ అవుతాయన్నారు. వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.