News September 11, 2025
మహిళా సాధికారత కమిటీ సమావేశంలో డీకే అరుణ

ఢిల్లీలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో మహిళా సాధికారత కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈనెల 14, 15న మహిళా సాధికారత కమిటీ స్టడీ టూర్ నేపథ్యంలో APలో తిరుపతి వేదికగా కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది. 2025లో ఎన్నికైన సభ్యుల పోర్టల్ ద్వారా క్షేత్ర స్థాయి సమాచారం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు.
Similar News
News September 11, 2025
SEP 17న సాయుధ పోరాట దినోత్సవం: MLA

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం కాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవంగా జరపాలని HYDలో జరిగిన ఓ సమావేశంలో డిమాండ్ చేశారు. 1947 SEP 11న పోరాటం ప్రారంభమైందని, ఆ పోరాట యోధుల విగ్రహాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
News September 11, 2025
డయేరియా కేసులపై అప్రమత్తంగా ఉన్నాం: నారాయణ

న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసుల నేపథ్యంలో తాము పూర్తి అప్రమత్తంగా ఉన్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, డయేరియా కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. వదంతులను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
News September 11, 2025
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్గా ప్రొ.డా.వాణి

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్గా అడిషనల్ DME ప్రొ.డా.వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతవరకు సూపరింటెండెంట్గా ఉన్న డా.రాజకుమారి గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ ప్రొఫెసర్గా వ్యవహరిస్తారని అధికారులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి పాలనా వ్యవహారాల్లో రోగులు, సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణలు, విమర్శలతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.