News September 11, 2025
ఖమ్మం: పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఈ విషాదం నెలకొంది. మధిర, సత్తుపల్లి, గుండాల మండలాల్లో పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. టేకులపల్లి, కామేపల్లి మండలాల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News March 20, 2026
సిరిసిల్ల : గ్యాస్ కష్టాలకు ‘డీజిల్’తో చెక్

వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు సిరిసిల్లకు చెందిన ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు వినూత్నంగా ఆలోచించి డీజిల్ స్టౌవ్ను రూపొందించాడు. మహేష్ అనే యువకుడు ఎయిర్ బ్లోయర్ సాయంతో పనిచేసే ఈ పొయ్యిని రూ. 10 వేల వ్యయంతో తయారు చేశాడు. లీటర్ డీజిల్తో గంటపాటు వంట చేసుకోవచ్చని తెలిపాడు. ఈ వినూత్న ప్రయోగం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
News March 20, 2026
వివాహంలో ఆటంకాలు.. సర్ప దోష నివారణకు సూచనలు

జాతకంలో సప్తమ, అష్టమ స్థానాల్లో రాహువు లేదా కేతువు ఉన్నప్పుడు సర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతుంటాయి. ఈ దోష నివారణకు కాళహస్తి వంటి క్షేత్రాల్లో రాహు-కేతు శాంతి పూజ చేయించుకోవడం ఉత్తమం. ఇంట్లో రోజూ దుర్గా చాలీసా పఠిస్తే రాహువు ప్రభావం తగ్గుతుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల వివాహానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.
News March 20, 2026
IPL ఆరంభ మ్యాచ్లకు స్టార్క్ దూరం

మరో ఆస్ట్రేలియన్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ IPL ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. ఈ పేసర్ను ఢిల్లీ క్యాపిటల్స్ ₹11.75 కోట్లకు సొంతం చేసుకుంది. బిజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ నేపథ్యంలో వర్క్లోడ్ మేనేజ్ చేయడం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా స్టార్క్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆసిస్ ప్లేయర్లలో కమిన్స్, హేజిల్వుడ్ సైతం కొన్ని IPL మ్యాచ్లకు దూరం కానున్నారు. ఎల్లిస్ ఈ సీజన్ మొత్తానికే వైదొలిగారు.


