News September 11, 2025

ములుగు: అల్లుడు చేతిలో మేనత్త హత్య

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామంలో మేనల్లుడి చేతిలో మేనత్త దారుణ హత్యకు గురైన ఘటన గురువారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొండగొర్ల విజయ్ (35) అనే వ్యక్తి తన మేనత్త కొండగొర్ల ఎల్లక్క (55)ను కత్తితో పొడిచి చంపాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News March 17, 2026

విశాఖ: ఒకే వేదికపై ప్రత్యర్థులు

image

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత ఎన్నికల్లో పరస్పర విమర్శలతో హోరెత్తించిన గంటా, అవంతి శ్రీనివాసరావు ఈ వేడుకలో చెట్టాపట్టాల్ వేసుకొని కనిపించడం విశేషం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

News March 17, 2026

అక్షయపాత్ర సేవలు అమూల్యం: రాష్ట్రపతి

image

దేశంలోని విద్యార్థులకు అక్షయపాత్ర పౌండేషన్ 500కోట్ల భోజనాలు అందించడంతో ఢిల్లీలో వేడుకలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అక్షయ పాత్ర ఛైర్మన్ మధు పండిత్ దాస, వైస్ ఛైర్మన్ చంచల పతి దాస, AP సెంట్రల్ రీజినల్ ప్రెసిడెంట్స్ శ్రీవంశధార దాసతో కలిసి చిన్నారులకు భోజనం వడ్డించారు. 16 రాష్ట్రాలు, 3UTల్లో 23.50 లక్షల మంది పిల్లలకు రోజూ ఆహారం అందించడం గొప్ప విషయమని కొనియాడారు.

News March 17, 2026

సూర్యాపేట: ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు’

image

జిల్లాలోని పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని డీఎంహెచ్‌ఓ డా.పెండెం వెంకటరమణ తెలిపారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చొరవతో రూ.15 లక్షల వ్యయంతో మెళ్లచెరువు, మట్టంపల్లి సహా ఐదు పీహెచ్‌సీల్లో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫలితంగా సాధారణ కాన్పులు నెలకు 4 నుంచి 12కు చేరాయని అన్నారు. మాతాశిశు సంరక్షణలో జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపినట్లు ఆయన వెల్లడించారు.