News September 11, 2025

జగిత్యాల జిల్లాలో 20 జడ్పీటీసీ, 216 ఎంపీటీసీ స్థానాలు

image

జగిత్యాల జిల్లాలో కొత్తగా ఏర్పడిన భీమారం, ఎండపల్లి మండలాలతో కలిపి మొత్తం 20 మండలాలకు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. గతంలో 18 ఎంపీపీ, 18 జడ్పీటీసీ స్థానాలుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 20కి చేరింది. పునర్వ్యవస్థీకరణ అనంతరం 214కు బదులుగా 216 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి. మండలంలో కనీసం ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Similar News

News September 11, 2025

ఎల్.ఎన్.పేట: పాముకాటుతో వ్యక్తి మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం బసవరాజుపేట గ్రామానికి చెందిన వాన అప్పలనాయుడు (45) పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గురువారం పొలంలో ఎరువులు వేస్తున్న సమయంలో కాలుకి పాము చుట్టుకుని కాటు వేసింది. పాము కాటును గుర్తించిన అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News September 11, 2025

మహిళలు ముందుండాలి: కలెక్టర్ పి. ప్రశాంతి

image

హుకుంపేటలోని జిల్లా సమాఖ్య కార్యాలయంలో గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ పి. ప్రశాంతి హాజరయ్యారు. రెండు దశాబ్దాలుగా స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరులో వచ్చిన మార్పులను ఆమె కొనియాడారు. ఆర్థిక సాధికారతతో పాటు, సామాజిక మార్పులోనూ మహిళలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.

News September 11, 2025

VZM: సంకల్ప్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం

image

సంకల్ప్ 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూషన్‌లో చట్టాలపై గురువారం అవగాహన కల్పించారు. వన్ స్టాప్ సెంటర్, శక్తిసాధన, సఖి నివాసం, 181 ఉమెన్ హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, లింగ సమానత్వం, పోషణ, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.