News September 11, 2025
15 ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా: లక్ష్మీశా

విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రత్యేక వైద్యులతో 24 గంటల పాటు వైద్య శిబిరం కొనసాగుతుందని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ముందు జాగ్రత్తగా పైప్లైన్ల ద్వారా తాగునీటి సరఫరా నిలిపివేసి, 15 ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. దీనిపై ఫిర్యాదుల కోసం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (9154970454) ఏర్పాటు చేశామని, రెవెన్యూ విభాగాలతో కూడిన ప్రత్యేక బృందాలు ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయన్నారు.
Similar News
News March 25, 2026
జగిత్యాల జిల్లా ముఖచిత్రం మారనుందా..?

జిల్లాలో ప్రస్తుతం JGTL, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా కొండగట్టు, మెట్పల్లి, రాయికల్ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయనే చర్చ జోరుగా సాగుతోంది.
మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి.
రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, బుగ్గారం.
కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, భీమారం.
జగిత్యాల, JGTL రూరల్.
మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాలతో కొండగట్టు నియోజకవర్గం ఏర్పడుతుందనే చర్చ SMలో నడుస్తోంది.
News March 25, 2026
అమెరికా-ఇరాన్ మధ్య పాక్.. వ్యూహమా? స్వార్థమా?

US, ఇరాన్ మధ్య గొడవను ఆపేందుకు పాక్ ఇప్పుడు మధ్యవర్తిగా మారుతోంది. దీని వెనుక శాంతి కంటే స్వార్థమే ఎక్కువ కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాలేక గల్ఫ్ దేశాల సపోర్ట్ కోసం ఇలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఇండియా ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించాలనే వ్యూహమూ కనిపిస్తోందంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డైరెక్షన్లో జరుగుతున్న ఈ టాక్టిక్స్కు ఇరాన్ ఇంకా ఓకే చెప్పలేదు.
News March 25, 2026
జగిత్యాల జిల్లాలో రాజకీయ నాయకుల ఆశలు..!

రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పెంపుపై కేంద్రప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఒకే జిల్లా పరిధిలో ఉండాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా జనాభా లెక్కల ప్రకారం తుది జాబితా రూపొందించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో 2 నుంచి 3 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనికోసం ఇప్పటి నుంచే ఆశావాహులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.


