News September 11, 2025
15 ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా: లక్ష్మీశా

విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రత్యేక వైద్యులతో 24 గంటల పాటు వైద్య శిబిరం కొనసాగుతుందని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ముందు జాగ్రత్తగా పైప్లైన్ల ద్వారా తాగునీటి సరఫరా నిలిపివేసి, 15 ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. దీనిపై ఫిర్యాదుల కోసం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (9154970454) ఏర్పాటు చేశామని, రెవెన్యూ విభాగాలతో కూడిన ప్రత్యేక బృందాలు ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయన్నారు.
Similar News
News September 11, 2025
పలు జిల్లాల కలెక్టర్లు బదిలీలు

AP: రాష్ట్ర ప్రభుత్వం 12జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఆయా జిల్లాలకు బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు..
* మన్యం- ప్రభాకర్ రెడ్డి, * విజయనగరం- రామసుందర్ రెడ్డి
* తూ.గో.- కీర్తి చేకూరు, * గుంటూరు- తమీమ్ అన్సారియా
* పల్నాడు- కృతిక శుక్లా, * బాపట్ల- వినోద్ కుమార్
* ప్రకాశం- రాజాబాబు, * నెల్లూరు- హిమాన్షు శుక్లా
* అన్నమయ్య- నిషాంత్ కుమార్, * కర్నూలు- ఎ.సిరి
* అనంతపురం- ఆనంద్, * సత్యసాయి- శ్యామ్ ప్రసాద్
News September 11, 2025
కర్నూలు జిల్లా కలెక్టర్ బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బదిలీ అయ్యారు. జిల్లాకు నూతన కలెక్టర్గా ఎ.సిరి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News September 11, 2025
భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోలు మృతి

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గరియాబాద్లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం. అటు మావోల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.