News September 11, 2025

మదనపల్లిలో లంబాడీల గడీలు..!

image

సంచార గిరిజన వర్గంగా గుర్తింపు పొందిన లంబాడీలకు(బంజారా) గడీలు ఉన్నాయంటే నమ్ముతారా..!? తెలంగాణలో ఒకప్పుడు దొరల పాలనకు ప్రతీకగా ఉండే గడీలను పోలిన కట్టడాలు ములుగు(M) మదనపల్లిలో ఉన్నాయి. నిజాం కాలంలో ఇక్కడి లంబాడీలు భూస్వాములుగా ఉండేవారని, అప్పుడే విలాసవంతమైన భవంతులను నిర్మించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. గడీలు శిథిలం కాగా వాటి ఆర్చీలు చెక్కు చెదరలేదు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ స్వగ్రామం ఇదే.

Similar News

News September 11, 2025

నెల్లూరు కొత్త కలెక్టర్ ఈయనే.!

image

నెల్లూరు కలెక్టర్‌గా నియమితులైన హిమాన్షు శుక్లా ఇది వరకు AP I&PR (సమాచార&ప్రజా సంబంధాల శాఖ) డైరెక్టర్‌గా పని చేశారు. ఈయన 2013 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి. హిమాన్షు పలు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.

News September 11, 2025

MBNR: యువతకు GOOD NEWS.. అప్లై చేసుకోండి

image

యువత వరల్డ్ స్కిల్ కాంపిటిషన్ -2025లో పాల్గొనుటకు ఈనెల 30లోపు రిజిస్టేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. కంప్యూటర్ ట్రేడ్స్‌కు 16-24లోపు ఉండాలని, ఈ పోటీలో జిల్లా, రాష్ట్ర, నేషనల్, ఇంటర్ నేషనల్ స్థాయిలో ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన అభ్యర్థులు దాదాపు 56కి పైగా నైపుణ్యాలలో పోటి పడొచ్చన్నారు. Web:https://www.skillindiadigital.gov.in.

News September 11, 2025

తెలుగు రాష్ట్రాల్లో కోటీశ్వరులు ఎందరంటే?

image

గతేడాది ట్యాక్స్ రిటర్న్స్ డేటా ప్రకారం రూ.కోటి అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. మన దేశంలో అధికంగా మహారాష్ట్రలో 1,24,800 మంది కోటీశ్వరులున్నారు. ఆ తర్వాత యూపీలో 24,050, మధ్యప్రదేశ్‌లో 8,666, తమిళనాడులో 6,288 మంది ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 5,340, తెలంగాణలో 1,260 మంది ఉండటం గమనార్హం. ఇక లద్దాక్‌లో ముగ్గురు, లక్షద్వీప్‌లో ఒకరు మాత్రమే ఉన్నారు.