News September 11, 2025
HYD: దసరా, దీపావళి.. స్టేషన్లలో బందోబస్తు

దసరా, దీపావళి సందర్భంగా లక్షలాది మంది సొంతూళ్లకు వెళతారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి,చర్లపల్లి రైల్వే స్టేషన్ల వద్ద భద్రతా చర్యలు పటిష్టం చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ‘వెయిటింగ్ హాల్, ప్లాట్ ఫాం వద్ద నిరంతర తనిఖీలు చేయాలి. ప్రయాణికులను క్యూ లైన్లలో రైళ్లలోకి పంపించాలి. ఎంట్రీ పాయింట్ల వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి’’ అని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News September 11, 2025
HYD: బతుకమ్మకు రావాలని కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మ పండుగ జరగనుంది. ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా కేసీఆర్ కుమార్తె కవితకు చింతమడక వాసులు ఆహ్వానం పలికారు. ఎంగిలి పూల బతుకమ్మకు రావాలని సొంత ఊరి నాయకులు, ప్రజలు కోరారు. తప్పకుండా వస్తానని బతుకమ్మ వేడుకలు జరుపుకుందామని ఊరి ప్రజలకు హామీ ఇచ్చారు.
News September 11, 2025
HYDలో మా‘రూటే’ సపరేటు..!

ఎన్ని నియమాలు పెట్టినా నగరంలో రాంగ్ రూట్లో వెళ్లేవారి ధోరణి మారడంలేదు. వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే.. యూటర్న్, సిగ్నల్స్ వద్ద వచ్చేదే రాంగ్ రూట్లో ఆపై ఓవర్ స్పీడ్. కరెక్ట్ రూట్లో వెళ్లేవారినే కిందపడేస్తుంటారు. మళ్లీ వారితో వాదిస్తుంటారు. ఆటోవాలాలు, బైకర్లు, కార్లతో ఈ నిబంధనలు ఉల్లంఘింస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారపై ప్రభుత్వం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.
News September 11, 2025
HYD: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోల్ ఫ్రీ నంబర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం HYDలోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం టోల్ ఫ్రీ కాల్ సెంటర్ను, హెల్ప్ డెస్క్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఫోన్ నం.1800 599 5991ను ఆవిష్కరించారు. ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉ. 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందన్నారు.