News September 11, 2025
శిథిలావస్థ గదుల్లో తరగతులు నిర్వహించవద్దు: డీఈఓ

జిల్లాలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో విద్యార్థులకు బోధన నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలల్లో ప్రమాదకరంగా ఉన్న గదుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు తప్పక గమనించాలని సూచించారు. విద్యార్థుల భద్రతే ప్రధానమని, ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.
Similar News
News September 11, 2025
వరంగల్: పెండింగ్ బిల్లుల చెల్లించాలని మంత్రికి వినతి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు రావాల్సిన బకాయిల బిల్లులు ఇప్పించాల్సిందిగా పోలీస్ సిబ్బంది మంత్రి కొండా సురేఖకు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించి మంత్రి బకాయిలలను ఇప్పించేందుకు ఆర్ధిక మంత్రితో మాట్లాడి పెండింగ్ బిల్స్ ఇప్పించేందు కృషి చేస్తానని పోలీస్ సిబ్బందికి హామీ ఇవ్వడం సిబ్బంది మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
News September 11, 2025
ప్రకాశం నూతన కలెక్టర్.. నేపథ్యం ఇదే!

ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 2013 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అఫీసర్ గతంలో ఆయన ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. ఏపీ స్టెప్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో, హౌసింగ్ కార్పొరేషన్ MD, కృష్ణా కలెక్టర్, విశాఖ గ్రేటర్ కమిషనర్గా వివిధ పదవులు నిర్వర్తించారు.
News September 11, 2025
తిరుమల చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

తిరుమల శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గాయత్రి అతిథి భవనం వద్దకు చేరుకున్నారు. ముందుగా ఆమెకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మురళీకృష్ణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఆమె తిరుమలలో బస చేసి శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.