News September 11, 2025

ఏలూరు: పాము కాటుకు గురై ఒకరు మృతి

image

లింగపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన ఏసుపాదం (48) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం గ్రామంలో పామాయిల్ తోటలో గెలలు కోస్తున్న సమయంలో పాముకాటుకు గురయ్యాడు. ఇది గమనించిన తోటి కూలీలు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతని మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 14, 2026

ఇంటింటికీ కొళాయి.. రూ.860 కోట్లు మంజూరు

image

ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా తాగునీరు అందించేందుకు రూ.860 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఉరవకొండకు రూ.480 కోట్లు, రాయదుర్గం నియోజకవర్గానికి రూ.380 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పయ్యావుల తెలిపారు. ఎన్నికల ముందు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన CM చంద్రబాబు తాగునీటి సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ మేరకు భారీగా నిధులు ఇచ్చారు.

News March 14, 2026

విశాఖ: దూసుకెళ్లిన స్కూలు బస్సు.. ఒకరి మృతి

image

శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూలు బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్లో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయనగరం (D) డెంకాడ (M) జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ మరొకరి బైక్‌పై వెళ్తుండగా స్కూలు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ డ్రైవ్ చేసినట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

News March 14, 2026

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షe కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత తెలిపారు. శనివారం నుంచి ఏప్రిల్ 16 వరకు సెక్షన్ 163 BNSS (144) అమల్లో ఉంటుందన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద గుమికూడడం, సభలు, ర్యాలీలు నిషేధించగా, 500 మీటర్ల పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.