News September 11, 2025
పార్వతీపురం: సారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి

సారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిఆర్ఓ హేమలత, ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సారా నిర్మూలనకు గ్రామాల్లో క్రమం తప్పకుండా నవోదయం 2.0 కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 11, 2026
వచ్చే నెలలో Xలో పేమెంట్ ఆప్షన్?

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో త్వరలో ఫోన్ పే, గూగుల్ పే తరహాలో పేమెంట్ ఆప్షన్స్ రానున్నాయి. వచ్చే నెలలో పరిమిత యూజర్లకు దీని ఎర్లీ యాక్సెస్ అందుబాటులో ఉంటుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనిపై X ఇప్పటికే వీసా సంస్థతో టైయప్ అయింది. కాగా Xను SM కంటే ఫైనాన్స్కు ప్రాధాన్యం ఉన్న ప్లాట్ఫామ్గా మారుస్తానని మస్క్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ట్రయల్స్ ఓకే అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.
News March 11, 2026
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> స్టేషన్ ఘనపూర్: కారు బైక్ ఢీ ఇద్దరికీ తీవ్ర గాయాలు
> జనగామ: సర్వికల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి టీకా
> జనగామ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సులు
> ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
> వంట గ్యాస్ ధరలను తగ్గించాలని జిల్లా వ్యాప్తంగా నిరసన
> పాలకుర్తి: వీధి కుక్కల దాడిలో 13 గొర్రెల మృతి
> మల్లికార్జున ఖర్గేను కలిసిన వరంగల్ ఎంపీ కావ్య
News March 11, 2026
కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించి భోజనం రుచికరంగా వండాలని వంట సిబ్బందిని జిల్లా కలెక్టర్ హైమవతి ఆదేశించారు. నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి రాత్రి భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, దోసకాయ కూర, సాంబారు, పెరుగును పరిశీలించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని ఆదేశించారు.


