News September 11, 2025

శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్: సీఎం

image

TG: ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్నీ పరిశీలించాలని సూచించారు.

Similar News

News March 17, 2026

పెరగనున్న కార్ల ధరలు!

image

కార్ల కంపెనీలు మరోసారి షాక్ ఇవ్వనున్నాయి. తమ వెహికల్స్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. రూపాయి పతనం, రా మెటీరియల్ ఖర్చులు ఎక్కువ కావడంతో ఇప్పటికే జనవరిలో ఓసారి పెంచాయి. తాజాగా వచ్చే నెలలో మెర్సిడెస్ బెంజ్, ఆడి 2 శాతం చొప్పున, టాటా సంస్థ 1.5 శాతం పెంచనున్నాయి. హ్యుందాయ్, మారుతీ సుజుకీ సహా మిగతా ప్రధాన సంస్థలు కూడా ధరలు సవరించాలని భావిస్తున్నాయి.

News March 17, 2026

‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరు మార్పు.. స్పందించిన డైరెక్టర్

image

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ మూవీ <<19398040>>పేరును<<>> ‘మాతృభూమి’గా మార్చడం తెలిసిందే. దీనిపై మూవీ డైరెక్టర్ అపూర్వ లాఖియా స్పందించారు. ‘ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ముందుగానే 2 టైటిల్స్ నమోదు చేసుకున్నాం. మానవత్వం, సానుభూతి, మన సైనికుల నిశ్శబ్ద పోరాటాల గురించి మూవీ తెలియజేస్తుంది. కొత్త టైటిల్ చిత్రంలోని భావోద్వేగాన్ని మరింత ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు.

News March 17, 2026

ఇరాన్ సుప్రీంలీడర్ రష్యాలో ఉన్నారా?

image

US, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా <<19366915>>గాయపడినట్లు <<>>వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రష్యా మిలిటరీ విమానంలో రహస్యంగా ఆయన్ను మాస్కో తరలించారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అక్కడ విజయవంతంగా మొజ్తబాకు సర్జరీ చేసినట్లు కథనాల్లో పేర్కొంది. మరోవైపు సుప్రీంలీడర్ క్షేమంగానే ఉన్నారని ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఇస్మాయిల్ తెలిపారు. ఎక్కడ ఉన్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.