News September 11, 2025

పెద్దపల్లి: డిజిటల్ తరగతులు పిల్లలకు కొత్త అవకాశాలు: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు తోడ్పడతాయని మంథని పర్యటనలో భాగంగా పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. టీచ్ ఫర్ చేంజ్ అందిస్తున్న కరికులంను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రహరీ గోడలు, టాయిలెట్స్, అదనపు తరగతులు, మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు.

Similar News

News September 11, 2025

KNR: ‘డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల’

image

2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు రూపొందించిన దోస్త్ చివరి అవకాశంగా స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసిందని SRR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. దోస్త్ వెబ్ సైట్‌లో ఖాళీల వివరాలు అందుబాటులో ఉంటాయని, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ విద్యార్థులకు SEP 15, 16వ తేదీల్లో జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.

News September 11, 2025

HYD: మ్యాన్ హోల్ ఘటనపై స్పందించిన హైడ్రా

image

పాతబస్తీలోని యాకుత్‌పురాలో మ్యాన్ హోల్‌లో పడిపోయిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో హైడ్రా ఊపిరి పీల్చుకుంది. బాధ్యులు ఎవరినే దానిపై ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని, స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు మట్టి తీసే పనిని హైడ్రా చేపట్టగా.. గట్టిగా ఉండడంతో జలమండలి మిషన్లతో తొలగించాలని నిర్ణయించారు. జలమండలి సిబ్బంది పని అయిన తర్వాత మ్యాన్ హోల్ మూత వేయకుండా వెళ్లిపోయినట్లు ప్రాథమిక సమాచారం.

News September 11, 2025

HYD: మ్యాన్ హోల్ ఘటనపై స్పందించిన హైడ్రా

image

పాతబస్తీలోని యాకుత్‌పురాలో మ్యాన్ హోల్‌లో పడిపోయిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో హైడ్రా ఊపిరి పీల్చుకుంది. బాధ్యులు ఎవరినే దానిపై ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని, స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు మట్టి తీసే పనిని హైడ్రా చేపట్టగా.. గట్టిగా ఉండడంతో జలమండలి మిషన్లతో తొలగించాలని నిర్ణయించారు. జలమండలి సిబ్బంది పని అయిన తర్వాత మ్యాన్ హోల్ మూత వేయకుండా వెళ్లిపోయినట్లు ప్రాథమిక సమాచారం.