News September 11, 2025

కాసేపట్లో జైలులో సరెండర్ కానున్న MP మిథున్ రెడ్డి

image

MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాసేపట్లో రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఆయనకు ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియనుండటంతో నేటి సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కానున్నారు. ఇప్పటికే ఆయన విజయావాడకు చేరుకుని రాజమండ్రికి బయలుదేరారు.

Similar News

News March 4, 2026

చిత్తూరు: ఇంట్లోనే నాటు తుపాకుల తయారీ..!

image

అప్పట్లో అక్రమ తయారీదారులు ఒక్కో <<19299453>>తుపాకి<<>>ని రూ.7-10 వేల వరకు విక్రయించే వారు. కొన్నాళ్లుగా ఈ తుపాకుల జాడలేకున్నా తాజా ఘటనతో చిత్తూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కొందరు సోషల్ మీడియాను ఉపయోగించి ఇంట్లోనే నాటు తుపాకులు తయారు చేసుకొనే అవకాశం లేకపోలేదు. పలమనేరు, మదనపల్లె, పుత్తూరు, చిత్తూరు ప్రాంతాల్లో నాటు తుపాకీల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తే ఎన్ని తుపాకులు బయటకు వస్తాయో చూడాలి.

News March 4, 2026

చిత్తూరులో మళ్లీ నాటుతుపాకుల వినియోగం.!

image

జిల్లాలో నాటుతుపాకి కలకలం రేపింది. అడవి పందులు, కుందేళ్లు, జింకలు, దుప్పివంటి వన్యప్రాణులను వేటాడి, మాంసాన్ని బెంగళూరు, చెన్నై నగరాలకు స్మగ్లింగ్ చేయడానికి నాటు తుపాకులు వినియోగించేవారు. 2020లో SP జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 500లకు పైగా నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతానికి అనుకొని ఉన్న కొన్ని గ్రామాల్లోని కంసాలీలు రహస్యంగా నాటు తుపాకులను తయారు చేసేవారు.

News March 4, 2026

చిత్తూరు: పదవుల కోసం పడిగాపులు..!

image

జిల్లాలో పదవుల కోసం TDP నేతల కళ్లు కాయలు కాచే పరిస్థితి నెలకొంది. CKబాబు, AS మనోహర్, దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు తమకు కార్పొరేషన్లు, లేదా పార్టీ పదవులు కావాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. పార్లమెంటరీ అధ్యక్ష పదవి ఆశించిన ఆశావహులకు రాష్ట్ర కమిటీలో స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా తమకు పదవులు ఇవ్వలేదని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.