News September 11, 2025

నన్ను టార్గెట్ చేస్తున్నారు: గడ్కరీ

image

ఇథనాల్ పెట్రోల్‌పై సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పెయిడ్ పొలిటికల్ క్యాంపెయిన్ జరుగుతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో అన్నారు. కొందరు తనను టార్గెట్ చేస్తున్నారని, ఆ ప్రచారాన్ని పట్టించుకోవద్దని కోరారు. E20 పెట్రోల్ సురక్షితం అని, దాన్ని ప్రభుత్వ నియంత్రణ సంస్థలతో పాటు ఆటోమొబైల్ కంపెనీలు స్వాగతించాయని పేర్కొన్నారు. కాగా E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతోందనే ప్రచారం జరుగుతోంది.

Similar News

News September 11, 2025

ALERT: మీరు గురక పెడతారా?

image

చాలామందికి నిద్రలో గురక రావడం సాధారణం. అయితే బిగ్గరగా గురక పెట్టేవారిని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది స్లీప్ ఆప్నియాకు సంకేతం కావొచ్చని, చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమస్య ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఆక్సిజన్ సరిగా అందక గుండెపోటు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. బ్రీతింగ్ మాస్కులు వాడటం, వెయిట్ తగ్గడం, సర్జరీ ఇతర చికిత్సల ద్వారా నయమవుతుందని సూచిస్తున్నారు.

News September 11, 2025

అమరావతిలో బ్యాంకర్ల బృందం పర్యటన

image

AP: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల బృందం పర్యటించింది. నగర అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టు కింద అమలవుతున్న పర్యావరణ, సామాజిక రక్షణ కార్యకలాపాలను పరిశీలించింది. CRDA అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులకు సూచనలు చేసింది. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ నర్సరీ, CRDA స్కిల్ హబ్ ప్రాంగణం, N9 ట్రంక్ రోడ్ పనులు, శాఖమూరు, నీరుకొండ రిజర్వాయర్‌ల వద్ద రక్షణ చర్యలను చెక్ చేసింది.

News September 11, 2025

గొర్రెల స్కాం.. బాధితులను విచారణకు పిలిచిన ఈడీ

image

TG: గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెలు కొనకుండానే రూ.కోట్లు కొట్టేశారనే ఆరోపణలపై విచారణ జరుపుతోంది. ఈ నెల 15న విచారణకు రావాలని బాధితులకు నోటీసులు జారీ చేసింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ఎగవేసి అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు అరెస్టవ్వగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSDపైనా కేసు నమోదైంది.