News September 11, 2025
HYD: సచివాలయంలో ఇంటర్నెట్ బంద్

సచివాలయంలో ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు శాఖల్లో పనులు స్తంభించాయి. ఉదయం నుంచి ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి కేబుల్స్ను సిబ్బంది కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 18, 2026
భీమవరం: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం

భీమవరం ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని వారు వివరించారు. దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వారు పేర్కొన్నారు.
News March 18, 2026
పిడుగుపాటుకు బాపట్ల జిల్లా మహిళ మృతి

భట్టిప్రోలు (M) రాచూరు పొలంలో పని చేస్తున్న మహిళా కూలిపై బుధవారం పిడుగుపడి మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. నగరం (M) ధూళిపూడికి చెందిన వనజ (35) మినుము పంటలో పనిచేస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురైంది. గాయపడిన ఆమెను ధూళిపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని PHCకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె తరలించారు.
News March 18, 2026
విశాఖ: దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం ప్రారంభం

దివ్యాంగుల కోసం ఏపీ ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తూ ఉచిత బస్సు సౌకర్యాన్ని బుధవారం ప్రారంభించింది. విశాఖలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగుల రవాణా సమస్యలు తగ్గి, సామాజిక-ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


