News September 11, 2025
జగిత్యాల: బావిలో దూకి యువతి SUICIDE

జగిత్యాల అర్బన్(M) ధరూర్కు చెందిన బాలె లక్ష్మణ్-పద్మల కుమార్తె దివ్య(26) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన దివ్య ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, గ్రామ పొలిమేరలోని ఓ వ్యవసాయ బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది. దివ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మానసికంగా కుంగిపోయిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
Similar News
News September 11, 2025
KNR: ‘డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల’

2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు రూపొందించిన దోస్త్ చివరి అవకాశంగా స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసిందని SRR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. దోస్త్ వెబ్ సైట్లో ఖాళీల వివరాలు అందుబాటులో ఉంటాయని, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ విద్యార్థులకు SEP 15, 16వ తేదీల్లో జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.
News September 11, 2025
HYD: మ్యాన్ హోల్ ఘటనపై స్పందించిన హైడ్రా

పాతబస్తీలోని యాకుత్పురాలో మ్యాన్ హోల్లో పడిపోయిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో హైడ్రా ఊపిరి పీల్చుకుంది. బాధ్యులు ఎవరినే దానిపై ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని, స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు మట్టి తీసే పనిని హైడ్రా చేపట్టగా.. గట్టిగా ఉండడంతో జలమండలి మిషన్లతో తొలగించాలని నిర్ణయించారు. జలమండలి సిబ్బంది పని అయిన తర్వాత మ్యాన్ హోల్ మూత వేయకుండా వెళ్లిపోయినట్లు ప్రాథమిక సమాచారం.
News September 11, 2025
HYD: మ్యాన్ హోల్ ఘటనపై స్పందించిన హైడ్రా

పాతబస్తీలోని యాకుత్పురాలో మ్యాన్ హోల్లో పడిపోయిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో హైడ్రా ఊపిరి పీల్చుకుంది. బాధ్యులు ఎవరినే దానిపై ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని, స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు మట్టి తీసే పనిని హైడ్రా చేపట్టగా.. గట్టిగా ఉండడంతో జలమండలి మిషన్లతో తొలగించాలని నిర్ణయించారు. జలమండలి సిబ్బంది పని అయిన తర్వాత మ్యాన్ హోల్ మూత వేయకుండా వెళ్లిపోయినట్లు ప్రాథమిక సమాచారం.