News September 11, 2025

సికింద్రాబాద్: కావేరీ సీడ్స్ వద్ద రైతులు నిరసన

image

సికింద్రాబాద్ పారడైస్‌లోని కావేరీ సీడ్స్ వద్ద ఛత్తీస్‌గఢ్ రైతులు గురువారం నిరసనకు దిగారు. కావేరి సీడ్స్ వేసి పంట నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి రూ.12,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద ఇచ్చారని పేర్కొన్న రైతులు ఒక్కో ఎకరానికి రూ.50 వేలు చెల్లించి నష్టాన్ని పూడ్చాలని కోరారు.

Similar News

News March 13, 2026

CSK ప్రమోషన్లలో రజినీ సాంగ్స్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్!

image

జెర్సీ రివీల్ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ‘కూలీ’ సాంగ్‌తో వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా చేయడాన్ని ‘సన్ టీవీ’ యాజమాన్యం తప్పుబట్టింది. అనుమతి లేకుండా జైలర్, కూలీ, జైలర్-2 సినిమాల పాటలను ఉపయోగించకుండా నిరోధించాలని ‘SUN TV’ మద్రాస్ హైకోర్టులో దావా వేసింది. కాపీరైట్ ఉల్లంఘనపై విచారణ చేపట్టిన జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

News March 13, 2026

వరంగల్: పది పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: ఈస్ట్ జోన్ డీసీపీ

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 150 పరీక్ష కేంద్రాల్లో(HNK 64, WGL 47 జనగామ 39) రేపటి నుంచి ఏప్రిల్ 16 వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్(144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, జిరాక్స్ సెంటర్లను బంద్ చేయాలన్నారు.

News March 13, 2026

వంటగ్యాస్.. దేశ ప్రజలకు కేంద్రం సూచన

image

దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంటగ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ప్రజలు ఆందోళన పడి పానిక్ బుకింగ్ చేసుకోవద్దని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పంపిణీని పర్యవేక్షించాలంది. టీవీలు పదేపదే పాత విజువల్స్‌ను చూపించవద్దని కోరింది. డేట్ వేసి విజువల్స్ ప్రసారం చేయాలని, దీనివల్ల ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరుతుందని తెలిపింది.