News September 11, 2025
నిమ్స్కు క్యూ కడుతున్న రోగులు

నగరంలో ప్రతిష్ఠాత్మక నిమ్స్ ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. చికిత్స కోసం వేల మంది ఓపీకి వస్తుండటంతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. 3 రోజుల్లోనే దాదాపు 11,590 మంది వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం 4,055 మంది, మంగళవారం 3,600 మంది వచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో రోగులురావడం నిమ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.
Similar News
News March 13, 2026
HYD: ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్!

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేడు సా.4 గంటలకు సమ్మె నోటీస్ ఇవ్వనుంది. ఉద్యోగుల డిమాండ్లు- ఆర్టీసీ ప్రభుత్వ విలీనం, 2021 పీఆర్సీ, ఉద్యోగ భద్రత, బస్సుల సంఖ్య పెంపు, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వంటి 11 అంశాలు- పరిష్కారం కాకపోవడంతో సమ్మెకు నిర్ణయించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు విమర్శించారు.
News March 13, 2026
HYD: ఇంటిపై కూరగాయల సాగు నేర్చుకుంటారా?

జంటనగరాల్లో ఇంటి పైకప్పులు, బాల్కనీలో కూరగాయలు పెంచాలనుకునే వారికి ఉద్యానశాఖ శిక్షణ ఇవ్వనుంది. అర్బన్ ఫార్మింగ్ పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అర్బన్ ఫార్మింగ్ విభాగం సంచాలకులు రామలక్ష్మి తెలిపారు. ఈ శిక్షణ మార్చి 14న నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఉ.10 గంటల నుంచి మ.ఒంటి గంట వరకు జరుగుతుంది. వివరాలకు 8977714411 ఈ నంబర్లో సంప్రదించాలని కోరారు.
# SHARE IT
News March 13, 2026
HYD: శ్రీలంక టూర్కి కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టుకు అనుమతి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టుకు శ్రీలంక పర్యటనకు అనుమతి లభించింది. తెలంగాణ జిల్లాల నుంచి ఎంపికైన యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం కల్పించడానికి ఈ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. టీమ్తె కోచ్ GS రాజు, మేనేజర్ వెంకటేశ్వరరావు, అబ్జర్వర్ శ్రీనివాస్ ఉంటారు. గ్రాస్రూట్ స్థాయిలో క్రికెట్ అభివృద్ధి చెందేలా చేయడం లక్ష్యం అంటున్నారు.


